శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఏనుగులగుంపు సంచారంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. దాదాపుగా రెండేళ్ల తర్వాత ఆహారం, తాగునీరు వెతుక్కుంటూ నాలుగు ఏనుగులు కడగండి- భూచంద్రి రహదారి వద్ద కనిపించేసరికి వారు భయపడ్డారు. పోడు వ్యవసాయంపైన ఆధారపడుతున్న తమకు ఏనుగుల సంచారంతో జీవనోపాధికి దూరమయ్యేట్లుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గజరాజుల నుంచి తమను అటవీశాఖాధికారులే కాపాడాలని కోరుకుంటున్నారు.
ఇవీ చదవండి