ETV Bharat / state

సౌదీలో శ్రీకాకుళంవాసి అనుమానాస్పద మృతి

author img

By

Published : Jun 18, 2020, 2:21 PM IST

శ్రీకాకుళం జిల్లా సీతానగరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. తన తోటివారితో కలిసి బతుకుతెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కారణాలేంటి..? కుటుంబ సభ్యులేమంటున్నారు.?

Srikakulam district worker Suspiciously died in Saudi Arabia
సౌదీలో శ్రీకాకుళంవాసి అనుమాన స్పద మృతి

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సీతానగరం గ్రామానికి చెందిన బత్సల శంకరరావు(38) సౌదీ అరేబియాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఇతడు గతేడాది మార్చిలో ఉపాధి కోసం 17మంది కూలీలతో కలసి వెల్డింగ్ పనులకు.. సౌదీలోని సీజర్ గ్రూప్ సంస్థలో చేరాడు. లాక్​డౌన్ కారణంగా ఉపాధిలేక తీవ్రఇబ్బందులు పడుతూ... అనారోగ్యంతో చనిపోయాడని తోటి కూలీలు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. అయితే కుటుంబసభ్యులు మాత్రం మృతిపై పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, తమకు చివరిచూపైనా దక్కేలా చూడాలని కోరుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం సీతానగరం గ్రామానికి చెందిన బత్సల శంకరరావు(38) సౌదీ అరేబియాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఇతడు గతేడాది మార్చిలో ఉపాధి కోసం 17మంది కూలీలతో కలసి వెల్డింగ్ పనులకు.. సౌదీలోని సీజర్ గ్రూప్ సంస్థలో చేరాడు. లాక్​డౌన్ కారణంగా ఉపాధిలేక తీవ్రఇబ్బందులు పడుతూ... అనారోగ్యంతో చనిపోయాడని తోటి కూలీలు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. అయితే కుటుంబసభ్యులు మాత్రం మృతిపై పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, తమకు చివరిచూపైనా దక్కేలా చూడాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: 940 కేజీల గంజాయి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.