ETV Bharat / state

కంటైన్మెంట్​ జోన్​లో కలెక్టర్ పర్యటన

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణంలో కరోనా కేసు నమోదైన ప్రాంతాన్ని కలెక్టర్ జె.నివాస్ పరిశీలించారు. కంటైన్మెంట్​ జోన్​లో పరీక్షల నిర్వహణ, నిత్యావసరాలు అందించడంపై అధికారులకు ఆదేశాలిచ్చారు. కంటైన్మెంట్​ జోన్​లో ఉన్న వారందరికీ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించాలన్నారు.

author img

By

Published : Jun 26, 2020, 7:09 PM IST

కంటైన్​మెంట్​ జోన్​లో కలెక్టర్ పర్యటన
కంటైన్​మెంట్​ జోన్​లో కలెక్టర్ పర్యటన

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో కలెక్టర్​ జె.నివాస్ పర్యటించారు. కరోనా కేసులు నమోదైన ఇచ్ఛాపురం పట్టణంలోని నీలకంఠేశ్వర వీధి కంటైన్మెంట్​ జోన్​ను ఆయన పరిశీలించారు. మున్సిపల్, రెవెన్యూ, వైద్య సిబ్బందితో మాట్లాడారు. కంటైన్మెంట్​ జోన్​లో సుమారు 160 మంది నుంచి నమూనాలు సేకరించినట్లు మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి కలెక్టర్​కు వివరించారు. కంటైన్మెంట్​ జోన్​లో ఉన్న వారందరికీ పరీక్ష నిర్వహించాలని కలెక్టర్​ అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అధికారులతో అన్నారు.

ఇంటింటా సర్వే నిర్వహించి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. నమూనాల సేకరించి, పరీక్షల సంఖ్య పెంచాలని ఆదేశించారు. కరోనా లక్షణాలు ఉన్న ధైర్యంగా ముందుకు రావాలని కోరారు. కంటైన్మెంట్​ జోన్​లో ఉన్న ప్రజలందరికీ నిత్యావసరాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో కలెక్టర్​ జె.నివాస్ పర్యటించారు. కరోనా కేసులు నమోదైన ఇచ్ఛాపురం పట్టణంలోని నీలకంఠేశ్వర వీధి కంటైన్మెంట్​ జోన్​ను ఆయన పరిశీలించారు. మున్సిపల్, రెవెన్యూ, వైద్య సిబ్బందితో మాట్లాడారు. కంటైన్మెంట్​ జోన్​లో సుమారు 160 మంది నుంచి నమూనాలు సేకరించినట్లు మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి కలెక్టర్​కు వివరించారు. కంటైన్మెంట్​ జోన్​లో ఉన్న వారందరికీ పరీక్ష నిర్వహించాలని కలెక్టర్​ అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అధికారులతో అన్నారు.

ఇంటింటా సర్వే నిర్వహించి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. నమూనాల సేకరించి, పరీక్షల సంఖ్య పెంచాలని ఆదేశించారు. కరోనా లక్షణాలు ఉన్న ధైర్యంగా ముందుకు రావాలని కోరారు. కంటైన్మెంట్​ జోన్​లో ఉన్న ప్రజలందరికీ నిత్యావసరాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఇదీ చదవండి : శ్రీసిటీపై కరోనా ఎఫెక్ట్... ఉత్పత్తి అంతంత మాత్రమే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.