పేదరికాన్ని పారద్రోలేందుకు విద్య అవసరమని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. విద్యతో దేనినైనా సాధించవచ్చని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని.. ఏ పేద విద్యార్థి విద్యకు దూరం కాకూడదని ముఖ్యమంత్రి ఆశయమన్నారు. విద్యకు ప్రాధాన్యంను ఇచ్చారన్న తమ్మినేని.. పాఠశాలలను నాడు - నేడు కార్యక్రమం కింద ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. జగనన్న విద్యా దీవెన కింద శ్రీకాకుళం జిల్లాలో 67 వేల 5 వందల 67 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇబీసీ, ముస్లిం, క్రిస్టియన్, కాపు తదితర వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని సభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు.
ఇదీ చదవండి: జగనన్న విద్యా దీవెన ప్రారంభం.. తల్లుల ఖాతాల్లోకే నగదు!