శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో పర్యటించిన సభాపతి తమ్మినేని సీతారాం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. గతంలో స్కూళ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉండేదని ప్రస్తుతం కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడే విధంగా తయారు చేస్తున్నామని తెలిపారు. పేద, మధ్య తరగతి పిల్లలకు విద్యావకాశాలు అందించటమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమన్నారు.
ఇదీచదవండి