ETV Bharat / state

పొందూరు ఎస్సై సస్పెన్షన్​.. ఫోన్​ సంభాషణ ఆధారంగా ఎస్పీ చర్యలు

పొందూరు ఎస్సై కొల్లి రామకృష్ణని సస్పెండ్ చేసినట్లు ఎస్పీ అమిత్ బర్దార్ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన మహిళతో ఎస్సై రామకృష్ణ ఫోన్ సంభాషణలు కలకలం రేగాయి. మహిళను ఎస్సై ఇంటికి రమ్మన్నట్లు ఫోన్‌లో సంభాషణలు ఉన్నాయనే ఆరోపణతో విచారణకు అదేశించిన ఎస్పీ అమిత్ బర్దార్.. ఎస్సై రామకృష్ణను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.

author img

By

Published : Aug 25, 2020, 11:28 AM IST

ponduru si suspension because of phone talk with lady says sp
ఎస్పీ అమిత్​ బర్దార్

మద్యం కేసులో పట్టుబడ్డ ఓ మహిళను తన ఇంటికి రావాలంటూ పొందూరు ఎస్సై ఫోన్​లో మాట్లాడిన సంభాషణ ఆధారంగా ఎస్పీ అమిత్​ బర్దార్​ సోమవారం ఆయనను సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పొందూరు మండలం రాపాక కూడలి సమీపంలోని కుమ్మరి కాలనీలో ఉంటున్న ఓ మహిళ ఇంట్లో మద్యం అక్రమ నిల్వలను శనివారం సాయంత్రం ఎస్సై కె. రామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది పట్టుకుని కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఈ కేసును మాపీ చేసేందుకు తనను పొందూరులోని ఆయన ఇంటికి రమ్మని ఎస్సై కోరినట్లు నిందితురాలు ఆరోపించారు. ఫోన్​ ఆడియో సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ చేసింది. దీని ఆధారంగా ఎస్సైపై... ఎస్పీ చర్యలు చేపట్టారు. ఈ విషయమై విచారణ అధికారిగా శ్రీకాకుళం 'దిశ' పోలీస్​ స్టేషన్​ డీఎస్పీ మూర్తిని నియమించినట్లు ఎస్పీ తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సైపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు జేఆర్​పురం సీఐ హెచ్​. మల్లేశ్వరరావు తెలిపారు. ఎచ్చెర్ల ఎస్సై రాజేష్​కు పొందూరు ఇన్​ఛార్జ్​ బాధ్యతలను అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి :

మద్యం కేసులో పట్టుబడ్డ ఓ మహిళను తన ఇంటికి రావాలంటూ పొందూరు ఎస్సై ఫోన్​లో మాట్లాడిన సంభాషణ ఆధారంగా ఎస్పీ అమిత్​ బర్దార్​ సోమవారం ఆయనను సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పొందూరు మండలం రాపాక కూడలి సమీపంలోని కుమ్మరి కాలనీలో ఉంటున్న ఓ మహిళ ఇంట్లో మద్యం అక్రమ నిల్వలను శనివారం సాయంత్రం ఎస్సై కె. రామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది పట్టుకుని కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఈ కేసును మాపీ చేసేందుకు తనను పొందూరులోని ఆయన ఇంటికి రమ్మని ఎస్సై కోరినట్లు నిందితురాలు ఆరోపించారు. ఫోన్​ ఆడియో సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ చేసింది. దీని ఆధారంగా ఎస్సైపై... ఎస్పీ చర్యలు చేపట్టారు. ఈ విషయమై విచారణ అధికారిగా శ్రీకాకుళం 'దిశ' పోలీస్​ స్టేషన్​ డీఎస్పీ మూర్తిని నియమించినట్లు ఎస్పీ తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సైపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు జేఆర్​పురం సీఐ హెచ్​. మల్లేశ్వరరావు తెలిపారు. ఎచ్చెర్ల ఎస్సై రాజేష్​కు పొందూరు ఇన్​ఛార్జ్​ బాధ్యతలను అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి :

దోషులకు సహకరించాడని వేటపాలెం ఎస్సై సస్పెన్షన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.