ETV Bharat / state

వైఎస్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజకు యత్నం.. అడ్డుకున్న భూ యజమాని

author img

By

Published : Jan 22, 2021, 2:22 PM IST

శ్రీకాకుళంలో వైఎస్సాఆర్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజకు వెళ్లిన మంత్రి సీదిరి అప్పలరాజుకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్న స్థలానికి చెందిన వ్యక్తి.. అభ్యంతరం చెప్పడంతో.. కార్యక్రమం ఆగిపోయింది. మంత్రి వెనుతిరగాల్సి వచ్చింది.

Sidiri appalaraju
మంత్రి అప్పలరాజు

శ్రీకాకుళంలోని సంతబొమ్మాళి - కోటబొమ్మాళి రహదారి సమీపంలో ఉన్న బస్ స్టేషన్ ప్రక్కన.. వైఎస్సాఆర్ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేయడానికి వెళ్లిన మంత్రి సీదిరి అప్పలరాజుకు చుక్కెదురైంది. విగ్రహాన్ని ప్రతిష్ఠించే స్థలం తనదని.. ఓ వ్యక్తి అభ్యంతరం తెలిపారు. అక్కడ విగ్రహం ఏర్పాటు చేయవద్దని చెప్పారు. ఫలితంగా... మంత్రి అక్కడి నుంచి వెనుతిరగవల్సి వచ్చింది. దీంతో వైకాపా కార్యకర్తలు నిరాశ చెందారు.

ముందుగా సంతబొమ్మాళిలోని పాలేశ్వరస్వామి ఆలయంలో నందేశ్వరస్వామి విగ్రహాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో అభద్రతా భావం సృష్టించడానికే తెదేపా కుట్రలు చేస్తోందని విమర్శించారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూడడం శోచనీయమన్నారు.

శ్రీకాకుళంలోని సంతబొమ్మాళి - కోటబొమ్మాళి రహదారి సమీపంలో ఉన్న బస్ స్టేషన్ ప్రక్కన.. వైఎస్సాఆర్ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేయడానికి వెళ్లిన మంత్రి సీదిరి అప్పలరాజుకు చుక్కెదురైంది. విగ్రహాన్ని ప్రతిష్ఠించే స్థలం తనదని.. ఓ వ్యక్తి అభ్యంతరం తెలిపారు. అక్కడ విగ్రహం ఏర్పాటు చేయవద్దని చెప్పారు. ఫలితంగా... మంత్రి అక్కడి నుంచి వెనుతిరగవల్సి వచ్చింది. దీంతో వైకాపా కార్యకర్తలు నిరాశ చెందారు.

ముందుగా సంతబొమ్మాళిలోని పాలేశ్వరస్వామి ఆలయంలో నందేశ్వరస్వామి విగ్రహాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో అభద్రతా భావం సృష్టించడానికే తెదేపా కుట్రలు చేస్తోందని విమర్శించారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూడడం శోచనీయమన్నారు.

ఇదీ చదవండి:

అఖిలప్రియ బెయిల్ పిటిషన్​పై ఉత్కంఠ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.