ETV Bharat / state

ఎంత ఖర్చైనా సరే... అందరికీ వ్యాక్సినేషన్: మంత్రి అప్పలరాజు

author img

By

Published : May 9, 2021, 9:35 PM IST

కరోనా వ్యాక్సినేషన్​పై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని మంత్రి అప్పలరాజు విజ్ఞప్తి చేశారు. అందరికీ ప్రభుత్వమే టీకా అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

మంత్రి అప్పలరాజు
ఎంత ఖర్చైనా అందరికీ వ్యాక్సినేషన్​ అందిస్తాం

రాష్ట్రంలో ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. కొన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని.. కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ వాదనలో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.

ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చు చేస్తోందని గుర్తు చేశారు. ప్రజలందరికీ కోవిడ్ వాక్సిన్ అందించడానికి రూ. 1600 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందని.. ఆ మొత్తాన్ని ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.

ఇవీ చదవండి:

రాష్ట్రంలో ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. కొన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని.. కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ వాదనలో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.

ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చు చేస్తోందని గుర్తు చేశారు. ప్రజలందరికీ కోవిడ్ వాక్సిన్ అందించడానికి రూ. 1600 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందని.. ఆ మొత్తాన్ని ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.

ఇవీ చదవండి:

ఆంక్షలు బేఖాతరు- అంత్యక్రియలకు వేలమంది హాజరు

నగదు వైపే మొగ్గు.. ల్యాప్‌టాప్‌లు కోరుకుంది కొందరే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.