ETV Bharat / state

గంగమ్మ తల్లీ.. కరోనా నుంచి మా బంధువులను రక్షించు - fisher women pujas to god ganga in echherla in srikakulam

ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు వెళ్లి కరోనా కారణంగా అక్కడ చిక్కుకుపోయిన తమ వారు క్షేమంగా రావాలని ఆకాంక్షిస్తూ శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార మహిళలు గంగమ్మ తల్లికి పూజలు చేశారు. ఎచ్చెర్ల మండలం బడివానిపేట గ్రామంలో సముద్రం ఒడ్డున ముర్రాటలతో అభిషేకం చేశారు.

గంగమ్మతల్లి.. కరోనా నుంచి మా బంధువులను రక్షించు..
గంగమ్మతల్లి.. కరోనా నుంచి మా బంధువులను రక్షించు..
author img

By

Published : Apr 18, 2020, 2:46 PM IST

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బడివానిపేట గ్రామంలోని మత్స్యకార మహిళలు గంగమ్మ తల్లికి పూజలు చేశారు. తమ వారిని కరోనా నుంచి రక్షించాలని.. వారు క్షేమంగా తిరిగి రావాలని వేడుకున్నారు. జిల్లాకు చెందిన సుమారు 5 వేల మంది మత్స్యకారులు లాక్​డౌన్​ కారణంగా గుజరాత్, కర్ణాటక, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో చిక్కుకున్నారు. అక్కడి ప్రభుత్వాలు వారిని పట్టించుకోవడం లేదని.. కనీసం నిత్యావసర సరుకులు సైతం అందించడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన మత్స్యకారులకు ఆహారం అందేలా ప్రభుత్వం, అధికారులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బడివానిపేట గ్రామంలోని మత్స్యకార మహిళలు గంగమ్మ తల్లికి పూజలు చేశారు. తమ వారిని కరోనా నుంచి రక్షించాలని.. వారు క్షేమంగా తిరిగి రావాలని వేడుకున్నారు. జిల్లాకు చెందిన సుమారు 5 వేల మంది మత్స్యకారులు లాక్​డౌన్​ కారణంగా గుజరాత్, కర్ణాటక, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో చిక్కుకున్నారు. అక్కడి ప్రభుత్వాలు వారిని పట్టించుకోవడం లేదని.. కనీసం నిత్యావసర సరుకులు సైతం అందించడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన మత్స్యకారులకు ఆహారం అందేలా ప్రభుత్వం, అధికారులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:

అనవసరంగా బయటకు వస్తే రంగు పడుద్ది.. ఆ తర్వాత..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.