ETV Bharat / state

'కాలు లేదు... వికలాంగ పింఛను ఇప్పించండి సారూ' - శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని అక్కరాపల్లి పంచాయితీ చవితిసీది

సెంటు భూమి లేనోడికి 12 ఎకరాలు భూమి ఉందని...సర్కారు నుంచి పింఛన్ అందలేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుదామంటే...ఆయనకు కాలు లేదు.  ఏంచేయాలో తెలియక ఆత్మ విశ్వాసాన్ని ఆయుధంగా మలిచి  భార్య సాయంతో మండల కార్యాలయాల చుట్టూ ప్రదిక్షిణలు చేస్తున్నాడు శ్రీకాకుళం జిల్లా వాసి యువరాజ్.

పింఛన్ కోసం ఎదురుచూస్తున్న యువరాజ్
author img

By

Published : Sep 22, 2019, 4:53 AM IST

Updated : Sep 22, 2019, 6:39 AM IST

కాలు లేదయ్యా... వికలాంగ పింఛను ఇప్పించడయ్యా

శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని అక్కరాపల్లి పంచాయితీ చవితిసీది గ్రామానికి చెందిన... బూర్లె యువరాజ్, ఇందు‌‌ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. విధికి ఏం అనిపించిందో ఏమో...ఈ కుటుంబాన్ని వంచించింది. యువరాజ్​కు బోన్ క్యాన్సర్‌ వచ్చింది. శస్త్రచికిత్స చేసి వైద్యులు ఎడమకాలును తొలగించారు. ఎంపీడీవో కార్యాలయంలో వైఎస్సార్‌ భరోసా పింఛను కోసం 4 నెలల క్రితం దరఖాస్తు చేశాడు. అతని పేరు మీద 12 ఎకరాల భూమి వెబ్‌సైట్‌లో ఉండటం వల్ల.... పింఛను మంజూరుకు అర్హత లేదని అధికారులు తేల్చి చెప్పారు. అండగా ఉండాల్సిన అధికారులు ఆదుకోనంటున్నారు. పింఛన్ కోసం... ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ భార్య సాయంతో ప్రదక్షిణలు చేస్తూ.... దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమని కార్యాలయం దగ్గరే ఉండిపోతున్నారు. వీరిని ఈటీవీ భారత్ ప్రతినిధి పలకరించేసరికి... కళ్లంట నీళ్లు తిప్పుతూ అసలు విషయం తెలిపారు. తన పేరు మీదున్న భూమిని తొలగించి పింఛను వచ్చేలా చూసి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: ఆ వృద్ధురాలికి అంత కష్టం ఏమెుచ్చిందో..!

కాలు లేదయ్యా... వికలాంగ పింఛను ఇప్పించడయ్యా

శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని అక్కరాపల్లి పంచాయితీ చవితిసీది గ్రామానికి చెందిన... బూర్లె యువరాజ్, ఇందు‌‌ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. విధికి ఏం అనిపించిందో ఏమో...ఈ కుటుంబాన్ని వంచించింది. యువరాజ్​కు బోన్ క్యాన్సర్‌ వచ్చింది. శస్త్రచికిత్స చేసి వైద్యులు ఎడమకాలును తొలగించారు. ఎంపీడీవో కార్యాలయంలో వైఎస్సార్‌ భరోసా పింఛను కోసం 4 నెలల క్రితం దరఖాస్తు చేశాడు. అతని పేరు మీద 12 ఎకరాల భూమి వెబ్‌సైట్‌లో ఉండటం వల్ల.... పింఛను మంజూరుకు అర్హత లేదని అధికారులు తేల్చి చెప్పారు. అండగా ఉండాల్సిన అధికారులు ఆదుకోనంటున్నారు. పింఛన్ కోసం... ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ భార్య సాయంతో ప్రదక్షిణలు చేస్తూ.... దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమని కార్యాలయం దగ్గరే ఉండిపోతున్నారు. వీరిని ఈటీవీ భారత్ ప్రతినిధి పలకరించేసరికి... కళ్లంట నీళ్లు తిప్పుతూ అసలు విషయం తెలిపారు. తన పేరు మీదున్న భూమిని తొలగించి పింఛను వచ్చేలా చూసి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: ఆ వృద్ధురాలికి అంత కష్టం ఏమెుచ్చిందో..!

Intro:ap_knl_101_21_rjd_visit_av_ap10054 ఆళ్లగడ్డ 8008574916 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకులు ఎం వెంకటకృష్ణారెడ్డి పరిశీలించారు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పర్యటించ ఇటీవల కురిసిన వర్షాలకు పాఠశాలకు జరిగిన నష్టాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుని అడిగితెలుసుకున్నారు జిల్లాలో 16 మండలాల్లో వివిధ పాఠశాలలు వర్షాల దెబ్బకు నష్టపోయారని వీటన్నిటి వివరాలను పూర్తిస్థాయిలో తీసుకొని మరమ్మతులు చేస్తామన్నారు పాఠశాలల్లో ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలన్నారు పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులతో మాట్లాడి అక్కడి సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు


Body:కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకులు ఎం వెంకటకృష్ణారెడ్డి పర్యటన


Conclusion:విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకులు
Last Updated : Sep 22, 2019, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.