ఇంజనీరింగ్ కళాశాల బస్సు బోల్తా పడి నలుగురికి గాయాలైన ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కె. కొత్తూరు వద్ద చోటు చేసుకుంది. స్థానిక ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల బస్సు.. పాతపట్నానికి చెందిన విద్యార్థులను ఎక్కించుకుని కళాశాల నుంచి కొద్ది దూరం వెళ్లగానే బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మందికిపైగా విద్యార్థులుండగా... వారిలో నలుగురు యువతులతో పాటు ఓ యువకుడికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు టెక్కలిలోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి బస్సు అదుపు తప్పినట్లు డ్రైవర్ తెలిపాడు.
ఇంజనీరింగ్ కళాశాల బస్సు బోల్తా.... ఐదుగురికి గాయాలు
ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బస్సు విద్యార్థులతో వెళ్తూ బోల్తా కొట్టింది. ఘటనలో ఐదుగురు గాయపడ్డారు.
ఇంజనీరింగ్ కళాశాల బస్సు బోల్తా పడి నలుగురికి గాయాలైన ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కె. కొత్తూరు వద్ద చోటు చేసుకుంది. స్థానిక ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల బస్సు.. పాతపట్నానికి చెందిన విద్యార్థులను ఎక్కించుకుని కళాశాల నుంచి కొద్ది దూరం వెళ్లగానే బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మందికిపైగా విద్యార్థులుండగా... వారిలో నలుగురు యువతులతో పాటు ఓ యువకుడికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు టెక్కలిలోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి బస్సు అదుపు తప్పినట్లు డ్రైవర్ తెలిపాడు.
NOTE: SVBC LIVE AVAILABLE
Body:.
Conclusion:.