ఇచ్ఛాపురంలో మున్సిపల్ ఎన్నిక నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని కాశీబుగ్గ డీఎస్పీ శివరాం రెడ్డి పేర్కొన్నారు. ఆ మున్సిపాలిటీ పరిధిలో పోటీ చేయనున్న అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. నలుగురు కన్నా ఎక్కువమంది కలిసి ప్రచారంలో పాల్గొనకూడదని హెచ్చరించారు. ఎవరి వార్డుల్లో వారు.. మాత్రమే ప్రచారం చేసుకోవాలని.. ఊరేగింపులకు ఎటువంటి అనుమతులు లేవని తేల్చి చెప్పారు.
ఇదీ చదవండీ... పుర పోరు: ప్రచారాలతో నేతలు.. ఏర్పాట్లతో అధికారులు బిజీబిజీ