ETV Bharat / state

జీవితాంతం కలిసి జీవించాలనుకున్నారు...అంతలోనే? - suicide news in echapuram

ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను కాదని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆనందంగా సాగింది వారి జీవనం. వారి ప్రేమకు గుర్తుగా ఓ కుమారుడు పుట్టాడు. సాఫీగా సాగుతున్న వారి కాపురంలో మనస్పర్థలు మొదలైయ్యాయి. మూడేళ్లు గడవకముందే దంపతులిద్దరూ తనువు చాలించారు. ఈ విషాదకర ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.

couple suicide in skikakulam
జీవితాంతం కలిసి జీవించాలనుకున్నారు...అంతలోనే?
author img

By

Published : Jan 13, 2021, 3:51 PM IST

Updated : Jan 13, 2021, 4:37 PM IST

ప్రేమ వివాహంతో ఒక్కటైన ఆ దంపతులు మూడేళ్లుగా గడవకముందే తనువు చాలించారు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. రత్తకన్న గ్రామంలో చిరంజీవి (26), లత (24) దంపతులు మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరువురు కుటుంబ సభ్యులుకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో గత రెండేళ్లుగా ఇచ్చాపురంలో ఉంటున్నారు.

ఇరువురి మధ్య చిన్నపాటి మనస్పర్థలు చోటు చేసుకున్నట్టు స్థానికులు తెలిపారు. దీంతో అయిన వాళ్లకు దూరంగా ఉంటున్నారనే ఉద్దేశంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని భావిస్తున్నారు. మృతుడు తాపీ మేస్త్రిగా పని చేస్తున్నాడు. వీరికి రెండేళ్ల బాబు.

దంపతులు ఇద్దరూ ఒకే తాడుతో ఉరి వేసుకుని చనిపోయినట్టు గ్రామస్థులు తెలిపారు. దహన సంస్కారాల కోసం శ్మశాన వాటికకు తీసుకు వెళ్లగా.. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: యాప్​లో డబ్బులు పెట్టాడు.. రైలు కింద తల పెట్టాడు!

ప్రేమ వివాహంతో ఒక్కటైన ఆ దంపతులు మూడేళ్లుగా గడవకముందే తనువు చాలించారు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. రత్తకన్న గ్రామంలో చిరంజీవి (26), లత (24) దంపతులు మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరువురు కుటుంబ సభ్యులుకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో గత రెండేళ్లుగా ఇచ్చాపురంలో ఉంటున్నారు.

ఇరువురి మధ్య చిన్నపాటి మనస్పర్థలు చోటు చేసుకున్నట్టు స్థానికులు తెలిపారు. దీంతో అయిన వాళ్లకు దూరంగా ఉంటున్నారనే ఉద్దేశంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని భావిస్తున్నారు. మృతుడు తాపీ మేస్త్రిగా పని చేస్తున్నాడు. వీరికి రెండేళ్ల బాబు.

దంపతులు ఇద్దరూ ఒకే తాడుతో ఉరి వేసుకుని చనిపోయినట్టు గ్రామస్థులు తెలిపారు. దహన సంస్కారాల కోసం శ్మశాన వాటికకు తీసుకు వెళ్లగా.. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: యాప్​లో డబ్బులు పెట్టాడు.. రైలు కింద తల పెట్టాడు!

Last Updated : Jan 13, 2021, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.