ETV Bharat / state

పాతపట్నంలో కరోనా.. కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించిన అధికారులు

author img

By

Published : Jun 16, 2020, 3:06 PM IST

బెంగళూరు నుంచి వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్​గా అనుమానిత ఫలితాలు రావడంతో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మేజర్ పంచాయతీలో రత్నాల పేట వీధిని కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు. నేటి నుంచి ఆయా ప్రాంతాల్లో ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని అధికారులను సిబ్బందిని ఆదేశించారు.

corona cases increased
పాతపట్నంలో కరోనా కంటోన్మెంట్​ జోన్​గా ప్రకటించిన అధికారులు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మేజర్ పంచాయతీలో రత్నాల పేట వీధిని కంటైన్మెంట్ జోన్​గా అధికారులు ప్రకటించారు. ఇటీవల బెంగళూరు నుంచి వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్​గా అనుమానిత ఫలితాలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులను పరీక్షల నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్​ ఆసుపత్రికి తరలించారు. మొదట్లో పరీక్షలు నిర్వహించగా నెగటివ్ ఫలితాలు వచ్చాయి. వారం రోజుల తర్వాత నిర్వహించిన పరీక్షా ఫలితాల్లో పాజిటివ్ వచ్చింది. దీంతో మంగళవారం ఆర్డీఓ కుమార్ పర్యవేక్షణలో కంటైన్మెంట్​ ప్రకటించారు.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మేజర్ పంచాయతీలో రత్నాల పేట వీధిని కంటైన్మెంట్ జోన్​గా అధికారులు ప్రకటించారు. ఇటీవల బెంగళూరు నుంచి వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్​గా అనుమానిత ఫలితాలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులను పరీక్షల నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్​ ఆసుపత్రికి తరలించారు. మొదట్లో పరీక్షలు నిర్వహించగా నెగటివ్ ఫలితాలు వచ్చాయి. వారం రోజుల తర్వాత నిర్వహించిన పరీక్షా ఫలితాల్లో పాజిటివ్ వచ్చింది. దీంతో మంగళవారం ఆర్డీఓ కుమార్ పర్యవేక్షణలో కంటైన్మెంట్​ ప్రకటించారు.

ఇవీ చూడండి.. పాత పట్నంలోని బ్యాంకుల ముందు క్యూ కట్టిన ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.