శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆదిఆంధ్ర వీధికి చెందిన దందాసి దుర్గారావు అనే వ్యక్తిపై అదే వీధికి చెందిన తోట వెంకీ కత్తితో దాడి చేశాడు. ఈఘటనలో బాధితుడికి తీవ్ర రక్తస్రావమైంది. అప్రమత్తమైన కుటుంబసభ్యులు దుర్గారావును టెక్కలిలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తీసుకెళ్లారు. దుర్గారావు భార్య గీతపై కూడా వెంకీ కుటుంబ సభ్యులు దాడి చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్యతో దుర్గారావు ఫోన్లో మాట్లాడుతున్నాడన్న అనుమానంతో వెంకీ ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీచదవండి.