ETV Bharat / state

ఆ పథకమే తప్పుడు నిర్ణయం.. వైకాపా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

author img

By

Published : May 22, 2022, 9:53 AM IST

MLA KETHIREDDY: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న "జలకళ" పథకంపై ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం మండలం సుబ్బారావు పేట గ్రామంలో నిర్వహించిన 'గుడ్​ మార్నింగ్' కార్యక్రమంలో ఆయన రైతులతో మాట్లాడారు. "జలకళ" పథకమే తప్పని అన్నారు.

MLA KETHIREDDY
జలకళ పథకమే తప్పు

MLA KETHIREDDY: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న "జలకళ" బోరుబావుల తవ్వకం పథకంపై.. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం మండలం సుబ్బారావుపేట గ్రామంలో నిర్వహించిన 'గుడ్​ మార్నింగ్' కార్యక్రమంలో ఆయన రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఓ మహిళా రైతు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. "జలకళ" బోరు వేశారని.. కానీ, ఇప్పటి వరకూ విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదని మల్లీశ్వరి ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో.. ఎమ్మెల్యే స్పందిస్తూ.. జలకళ పథకం కింద ఎంతమందికి బోర్లు వేయాలి..? ఎంత లోతు వేయాలి? అనేది మాకు కూడా అర్థం కాలేదని ఆయన అన్నారు. అసలు ఈ పథకమే తప్పని.. ఒకరికి వేసి ఒకరికి వేయలేని రిస్థితి తలెత్తుతోందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో.. అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు.

MLA KETHIREDDY: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న "జలకళ" బోరుబావుల తవ్వకం పథకంపై.. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం మండలం సుబ్బారావుపేట గ్రామంలో నిర్వహించిన 'గుడ్​ మార్నింగ్' కార్యక్రమంలో ఆయన రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఓ మహిళా రైతు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. "జలకళ" బోరు వేశారని.. కానీ, ఇప్పటి వరకూ విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదని మల్లీశ్వరి ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో.. ఎమ్మెల్యే స్పందిస్తూ.. జలకళ పథకం కింద ఎంతమందికి బోర్లు వేయాలి..? ఎంత లోతు వేయాలి? అనేది మాకు కూడా అర్థం కాలేదని ఆయన అన్నారు. అసలు ఈ పథకమే తప్పని.. ఒకరికి వేసి ఒకరికి వేయలేని రిస్థితి తలెత్తుతోందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో.. అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.