ETV Bharat / state

లోకేశ్ యువగళం పాదయాత్రలో సందడి చేసిన జెసి ప్రభాకర్ రెడ్డి - about Yuvagalam Padayatra

Nara Lokesh Yuvagalam Padayatra: రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటి చేసే వారిలో 60 శాతం యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ నేత జెసి ప్రభాకర్ రెడ్డి అన్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్​ను కలిసిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు వైసీపీ ప్రభుత్వం మీద విసిగిపోయినందునే.. పాదయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని జెసి ప్రభాకర్ రెడ్డి  వెల్లడించారు.

లోకేశ్ యువగళం పాదయాత్రలో జెసి
లోకేశ్ యువగళం పాదయాత్రలో జెసి
author img

By

Published : Mar 29, 2023, 10:10 PM IST

JC Prabhakar Reddy participated in Yuvagalam: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో వ్యాపార వర్గాలతో సమావేశం నిర్వహించారు. యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న నారాలోకేశ్ పెనుకొండ సమీపంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్ వద్ద భోజనం విరామం తీసుకొన్నారు. భోజన అనంతరం పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లోని వ్యాపార వర్గాలతో సమావేశం నిర్వహించారు. 4ఏళ్ళ కాలంలో కరోనాతో నష్టపోయిన తమకు ప్రభుత్వం నుంచి పన్నుల భారం అధికమై వ్యాపారులు లోకేశ్​తో వాపోయారు. తాము అన్నివిధాలా నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక కంటే ఏపీలో పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. పెట్రోలు, డీజిల్ ధరల్లో రూ.12 వ్యత్యాసం ఉండడంతో, 11బంకులు మూతపడ్డాయని వెల్లడించారు. ఇసుక అధికధరలు, అందుబాటులో లేకపోవడంతో నిర్మాణరంగం కుదేలయిందని బిల్డర్లు నారాలోకేశ్ ఎదుట వాపోయారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తమను ఆదుకొంటే తప్ప కోలుకోలేనంతగా నష్టపోయామని వ్యాపారులు పేర్కొన్నారు.

బ్రాహ్మణ సంఘం: దేశంలోనే ప్రప్రథమంగా బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి సేవలందించింది తెలుగుదేశం పార్టీయే అని టీడీపీ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు భాను కీర్తి పేర్కొన్నారు. బుధవారం ఉదయం యువగలం పాదయాత్ర సోమందేపల్లి మండలంలోని నల్లగొండరాయనపల్లి విడదీ కేంద్రం వద్ద బ్రాహ్మణ సంఘం సభ్యులతో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​చో ముఖాముఖి నిర్వహించారు. 2024 లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారని నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు దేశంపార్టీ అధికారంలో ఉన్నప్పుడు బ్రాహ్మణులకు ఇచ్చిన అన్ని పథకాలను 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేశారని లోకేశ్​కు మొరపెట్టుకున్నారు. లోకేశ్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.

జెసి ప్రభాకర్ రెడ్డి: రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటి చేసే వారిలో 60 శాతం యువతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని టీడీపీ నేత జెసి ప్రభాకర్ రెడ్డి అన్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్​ను కలిసి అభినందనలు చెప్పారు. పాదయాత్రతో పెద్ద ఎత్తున మార్పు కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం మీద విసిగిపోయినందునే పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని జెసి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. రానున్నది కచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వమేనని అయితే, సీనియర్​ల తోక కోసి 60 శాతం సీట్లు యువతకే ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. తనను కలవడానికి వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆలింగనం చేసుకున్న నారా లోకేష్, మీరు మా హీరో అంటూ ప్రభాకర్ రెడ్డిని అనడంతో, అక్కడున్న టీడీపీ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కేకలు వేశారు.

లోకేశ్ యువగళం పాదయాత్రలో జెసి

ఇవీ చదవండి:

JC Prabhakar Reddy participated in Yuvagalam: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో వ్యాపార వర్గాలతో సమావేశం నిర్వహించారు. యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న నారాలోకేశ్ పెనుకొండ సమీపంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్ వద్ద భోజనం విరామం తీసుకొన్నారు. భోజన అనంతరం పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లోని వ్యాపార వర్గాలతో సమావేశం నిర్వహించారు. 4ఏళ్ళ కాలంలో కరోనాతో నష్టపోయిన తమకు ప్రభుత్వం నుంచి పన్నుల భారం అధికమై వ్యాపారులు లోకేశ్​తో వాపోయారు. తాము అన్నివిధాలా నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక కంటే ఏపీలో పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. పెట్రోలు, డీజిల్ ధరల్లో రూ.12 వ్యత్యాసం ఉండడంతో, 11బంకులు మూతపడ్డాయని వెల్లడించారు. ఇసుక అధికధరలు, అందుబాటులో లేకపోవడంతో నిర్మాణరంగం కుదేలయిందని బిల్డర్లు నారాలోకేశ్ ఎదుట వాపోయారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తమను ఆదుకొంటే తప్ప కోలుకోలేనంతగా నష్టపోయామని వ్యాపారులు పేర్కొన్నారు.

బ్రాహ్మణ సంఘం: దేశంలోనే ప్రప్రథమంగా బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి సేవలందించింది తెలుగుదేశం పార్టీయే అని టీడీపీ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు భాను కీర్తి పేర్కొన్నారు. బుధవారం ఉదయం యువగలం పాదయాత్ర సోమందేపల్లి మండలంలోని నల్లగొండరాయనపల్లి విడదీ కేంద్రం వద్ద బ్రాహ్మణ సంఘం సభ్యులతో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​చో ముఖాముఖి నిర్వహించారు. 2024 లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారని నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు దేశంపార్టీ అధికారంలో ఉన్నప్పుడు బ్రాహ్మణులకు ఇచ్చిన అన్ని పథకాలను 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేశారని లోకేశ్​కు మొరపెట్టుకున్నారు. లోకేశ్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.

జెసి ప్రభాకర్ రెడ్డి: రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటి చేసే వారిలో 60 శాతం యువతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని టీడీపీ నేత జెసి ప్రభాకర్ రెడ్డి అన్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్​ను కలిసి అభినందనలు చెప్పారు. పాదయాత్రతో పెద్ద ఎత్తున మార్పు కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం మీద విసిగిపోయినందునే పాదయాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని జెసి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. రానున్నది కచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వమేనని అయితే, సీనియర్​ల తోక కోసి 60 శాతం సీట్లు యువతకే ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. తనను కలవడానికి వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆలింగనం చేసుకున్న నారా లోకేష్, మీరు మా హీరో అంటూ ప్రభాకర్ రెడ్డిని అనడంతో, అక్కడున్న టీడీపీ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కేకలు వేశారు.

లోకేశ్ యువగళం పాదయాత్రలో జెసి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.