ETV Bharat / state

సీఎం జన్మదిన వేడుకల్లో వైసీపీ నేతల వర్గ పోరు... అయోమయంలో కార్యకర్తలు - Sectarian differences in Hindupuram YCP

CM Jagan birthday celebrations in AP: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను నలుగురు నాయకులు నాలుగు విధాలుగా జరుపుకున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలు ఎవరి వద్దకెళ్లి వేడుకలు జరుపుకోవాలో అర్థంకాక అయోమయంలో పడ్డారు.

వైకాపా నేతలు పోటాపోటీగా బైక్ ర్యాలీ
CM Jagan birthday celebrations
author img

By

Published : Dec 21, 2022, 9:52 PM IST

CM Jagan birthday celebrations: సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకల సాక్షిగా.. వైకాపాలోని వర్గపోరు రెండు జిల్లాల్లో మరోసారి బయటపడింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నలుగురు నేతలు నాలుగు విధాలుగా సీఎం పుట్టినరోజు వేడుకలు జరిపారు. అంబేద్కర్ కూడలి వద్ద వైకాపా నాయకులు నవీన్ నిశ్చల్, చౌలూరు మధుమతి రెడ్డి, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ విడివిడిగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించగా... గుడ్డంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్ లో కేక్ కట్ చేసి సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. వైకాపా హిందూపురం పరిశీలకుడు రెడ్డి ఈశ్వర్ రెడ్డి నలుగురు నేతలు విడివిడిగా నిర్వహించిన కార్యక్రమాలకు హాజరుకావడంతో... కార్యకర్తల్లో అయోమయ పరిస్థితి నెలకొంది.

నెల్లూరు నగరంలో వైకాపా నేతలు పోటాపోటీగా బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, రూప్ కూమార్ యాదవ్ మధ్య నెలకొన్న విభేదాలతో జగన్‌ జన్మదిన వేడుకలు పోటాపోటీగా నిర్వహించారు. దీంతో గాంధీబొమ్మ వద్ద హడావుడి నెలకొని, చీరల పంపిణీలో తోపులాట చోటుచేసుకుంది. పలువురు మహిళలు కిందపడ్డారు.

CM Jagan birthday celebrations: సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకల సాక్షిగా.. వైకాపాలోని వర్గపోరు రెండు జిల్లాల్లో మరోసారి బయటపడింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నలుగురు నేతలు నాలుగు విధాలుగా సీఎం పుట్టినరోజు వేడుకలు జరిపారు. అంబేద్కర్ కూడలి వద్ద వైకాపా నాయకులు నవీన్ నిశ్చల్, చౌలూరు మధుమతి రెడ్డి, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ విడివిడిగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించగా... గుడ్డంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్ లో కేక్ కట్ చేసి సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. వైకాపా హిందూపురం పరిశీలకుడు రెడ్డి ఈశ్వర్ రెడ్డి నలుగురు నేతలు విడివిడిగా నిర్వహించిన కార్యక్రమాలకు హాజరుకావడంతో... కార్యకర్తల్లో అయోమయ పరిస్థితి నెలకొంది.

నెల్లూరు నగరంలో వైకాపా నేతలు పోటాపోటీగా బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, రూప్ కూమార్ యాదవ్ మధ్య నెలకొన్న విభేదాలతో జగన్‌ జన్మదిన వేడుకలు పోటాపోటీగా నిర్వహించారు. దీంతో గాంధీబొమ్మ వద్ద హడావుడి నెలకొని, చీరల పంపిణీలో తోపులాట చోటుచేసుకుంది. పలువురు మహిళలు కిందపడ్డారు.

సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో.. వైసీపీ నేతల వర్గ పోరు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.