ETV Bharat / state

తెదేపా వృద్ధ అభిమానిపై వైకాపా కార్యకర్తల దాడి

తెదేపా కార్యకర్తలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వృద్ధుడు అని కూడా చూడకుండా ప్రకాశం జిల్లాలో ఓ వృద్ధుడిపై వైకాపా కార్యకర్తలు కొడవలతో దాడి చేశారు. తెదేపాకు ఓటు వేసినందుకే తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపించాడు.

author img

By

Published : Jul 19, 2019, 11:31 PM IST

బాధితుడు
వృద్ధుడిపై వైకాపా కార్యకర్తల దాడి

ఎన్నికలు జరిగి నెలలు గడుస్తున్నా గ్రామాల్లో మాత్రం దాని ప్రభావం తగ్గలేదు. ప్రకాశం జిల్లా పొందూరు పంచాయతీ లక్ష్మక్క పల్లెలో తెదేపా కార్యకర్తపై వైకాపా అభిమానులు దాడి చేశారు. గ్రామస్తులు మద్దినేని నరసింహారావు, కుమారుడు శ్రీధర్ మరో నలుగురు వైకాపా కార్యకర్తలతో కలిసి తెదేపా కార్యకర్త సుబ్బారాయుడుపై రాళ్లు, కొడవలితో దాడి చేశారు. భాదితుడి తలకు గాయం కావటంతో కుటుంబసభ్యులు ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మనవరాలిని పాఠశాలలో వదిలిపెట్టడానికి వెళ్లి వస్తున్న తనపై అన్యాయంగా దాడి చేశారని సుబ్బారాయుడు అన్నారు. ఎన్నికల్లో వైకాపా విజయం సాధించిన తర్వాత నుంచి ఎదో ఒక కారణంతో తమని దుర్భాషలాడుతున్నారని తెలిపారు.

వృద్ధుడిపై వైకాపా కార్యకర్తల దాడి

ఎన్నికలు జరిగి నెలలు గడుస్తున్నా గ్రామాల్లో మాత్రం దాని ప్రభావం తగ్గలేదు. ప్రకాశం జిల్లా పొందూరు పంచాయతీ లక్ష్మక్క పల్లెలో తెదేపా కార్యకర్తపై వైకాపా అభిమానులు దాడి చేశారు. గ్రామస్తులు మద్దినేని నరసింహారావు, కుమారుడు శ్రీధర్ మరో నలుగురు వైకాపా కార్యకర్తలతో కలిసి తెదేపా కార్యకర్త సుబ్బారాయుడుపై రాళ్లు, కొడవలితో దాడి చేశారు. భాదితుడి తలకు గాయం కావటంతో కుటుంబసభ్యులు ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మనవరాలిని పాఠశాలలో వదిలిపెట్టడానికి వెళ్లి వస్తున్న తనపై అన్యాయంగా దాడి చేశారని సుబ్బారాయుడు అన్నారు. ఎన్నికల్లో వైకాపా విజయం సాధించిన తర్వాత నుంచి ఎదో ఒక కారణంతో తమని దుర్భాషలాడుతున్నారని తెలిపారు.

Intro:గత రెండు రోజులుగా కురుస్తున్న చిన్నపాటి వర్షానికే శేషాచలం అడవులు సరికొత్త శోభను సంతరించుకున్నాయి.


Body:ap_tpt_36_19_talakona_jalapatam_av_c5

శేషాచలం అడవులు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న చిన్నపాటి వర్షానికే పుడమి తల్లి పులకించి పచ్చని చెట్లతో శేషాచలం అడవులు కనువిందు చేస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే తలకోనలోని జలపాతాన్ని వీక్షకులకు కనువిందు చేస్తుంది. ఈ జలపాతం అందాలను వీక్షించడానికోసం సుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాక సుదూర ప్రాంతాలు చెన్నై, కర్ణాటక నుంచి కూడా పర్యాటక ప్రేమికులు వస్తూ ఉంటారు. ఇక్కడకు వచ్చిన యువతీ యువకులు తమ సెల్ ఫోన్లలో తలకోన ప్రకృతి అందాలను బందిస్తూ ఆనంద పడుతున్నారు. తలకోన కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గిల్లతీగ పై పిల్లలు, యువకులు వూగుతూ కేరింతలు కొడుతున్నారు.జలపాతం బాగా వస్తున్నందున పర్యాటకుల తాకిడి ఎక్కువ అవుతుంది. దీనికి తగ్గట్టు అటవీశాఖ అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు.


Conclusion:పి. రవి కిషోర్ ,చంద్రగిరి.9985555813.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.