ETV Bharat / state

మార్కాపురంలో సచివాలయ ఉద్యోగుల నిరసన.. వారిపై చర్యలకు డిమాండ్​

author img

By

Published : Oct 17, 2022, 7:25 PM IST

SECRETARIAT EMPLOYEES PROTEST: అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న గ్రామ సచివాలయ ఉద్యోగి మరణానికి సంతాపంగా మార్కాపురంలో పలువురు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగి మరణానికి కారణమైన అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

SECRETARIAT EMPLOYEES PROTEST
SECRETARIAT EMPLOYEES PROTEST

VILLAGE SECRETARIAT EMPLOYEES PROTEST : తూర్పుగోదావరి జిల్లా జి.దొంతమూరు గ్రామ సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ.. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సచివాలయ ఉద్యోగులు నిరసన తెలిపారు. రెండు రోజుల క్రితం ఉన్నతాధికారి సస్పెండ్ చేస్తామని చెప్పడంతో సుభాష్ చంద్రవర్మ అనే హార్టికల్చర్ ఉద్యోగి.. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రాప్ నమోదు.. బయోమెట్రిక్ వేయించడంలో పలు సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో తమపై అధికారులు అనేక ఒత్తిళ్లకు పాల్పడుతున్నారని.. ఇకనైనా తమపై వేధింపులు ఆపాలని మార్కాపురం సబ్ కలెక్టర్ సేతు మాధవ్​కు వినతి పత్రం అందజేశారు.

VILLAGE SECRETARIAT EMPLOYEES PROTEST : తూర్పుగోదావరి జిల్లా జి.దొంతమూరు గ్రామ సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ.. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సచివాలయ ఉద్యోగులు నిరసన తెలిపారు. రెండు రోజుల క్రితం ఉన్నతాధికారి సస్పెండ్ చేస్తామని చెప్పడంతో సుభాష్ చంద్రవర్మ అనే హార్టికల్చర్ ఉద్యోగి.. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రాప్ నమోదు.. బయోమెట్రిక్ వేయించడంలో పలు సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో తమపై అధికారులు అనేక ఒత్తిళ్లకు పాల్పడుతున్నారని.. ఇకనైనా తమపై వేధింపులు ఆపాలని మార్కాపురం సబ్ కలెక్టర్ సేతు మాధవ్​కు వినతి పత్రం అందజేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.