ETV Bharat / state

సింగరాయకొండలో విగ్రహాల ధ్వంసం కేసు: పాత్రికేయులకు బెయిల్

author img

By

Published : Jan 12, 2021, 9:26 AM IST

సింగరాయకొండ లక్ష్మీనరసింహస్వామి స్వాగత ద్వారంలో సిమెంట్ విగ్రహాల ధ్వంసం కేసులో అరెస్టైన పాత్రికేయులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

The court granted bail to the journalists
పాత్రికేయులకు బెయిల్

ప్రకాశం జిల్లా సింగరాయకొండ లక్ష్మీనరసింహస్వామి స్వాగత ద్వారంలో సిమెంట్ విగ్రహాలు ధ్వంసం కేసులో అరెస్టైన పాత్రికేయులు... బెయిల్​పై విడుదలయ్యారు. ఈ నెల 5న వారు అరెస్ట్ కాగా.. జర్నలిస్ట్ సంఘాలు సహకారంతో కందుకూరు కోర్టులో పిటిషన్​ వేశారు. వాదనలు విన్న న్యాయస్థానం ఐదుగురు పాత్రికేయులకు బెయిల్ మంజూరు చేసింది.

ఈ మేరకు ఒంగోలు సబ్ జైలు నుంచి బెయిల్​పై విడుదలయిన పాత్రికేయులకు జర్నలిస్ట్ సంఘాలు స్వాగతం పలికాయి. సత్కారం చేసి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘాల నాయకులు ఐ.వి.సుబ్బారావు, నాగేశ్వరరావు, బ్రహ్మం తదితర పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లా సింగరాయకొండ లక్ష్మీనరసింహస్వామి స్వాగత ద్వారంలో సిమెంట్ విగ్రహాలు ధ్వంసం కేసులో అరెస్టైన పాత్రికేయులు... బెయిల్​పై విడుదలయ్యారు. ఈ నెల 5న వారు అరెస్ట్ కాగా.. జర్నలిస్ట్ సంఘాలు సహకారంతో కందుకూరు కోర్టులో పిటిషన్​ వేశారు. వాదనలు విన్న న్యాయస్థానం ఐదుగురు పాత్రికేయులకు బెయిల్ మంజూరు చేసింది.

ఈ మేరకు ఒంగోలు సబ్ జైలు నుంచి బెయిల్​పై విడుదలయిన పాత్రికేయులకు జర్నలిస్ట్ సంఘాలు స్వాగతం పలికాయి. సత్కారం చేసి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘాల నాయకులు ఐ.వి.సుబ్బారావు, నాగేశ్వరరావు, బ్రహ్మం తదితర పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

పశ్చిమగోదావరి జిల్లాలో యువకుడు దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.