ETV Bharat / state

'తేజస్విని ఆత్మహత్యకు ప్రభుత్వ వైఫల్యమే కారణం' - తేజస్వి ఆత్మహత్య వార్తలు

బీటెక్ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్యపై తెలుగుదేశం మహిళా నేత పద్మజ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని మండిపడ్డారు. తేజస్విని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

Telugudesam party women president Padmaja fire on student tejasvi suicide incident
తెలుగుదేశం పార్టీ మహిళ అధ్యక్షులు పద్మజ
author img

By

Published : Feb 7, 2021, 4:46 PM IST

ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ప్రకాశం జిల్లా ఒంగోలులో బీటెక్ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య చేసుకుందని తెదేపా మహిళా నేత పద్మజ ఆరోపించారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన ఫీజు రీయింబర్స్​మెంట్ హామీలను అమలుపరచడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సొంత జిల్లాలో ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, రూ.10 లక్షలు ఎక్స్​గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ప్రకాశం జిల్లా ఒంగోలులో బీటెక్ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య చేసుకుందని తెదేపా మహిళా నేత పద్మజ ఆరోపించారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన ఫీజు రీయింబర్స్​మెంట్ హామీలను అమలుపరచడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సొంత జిల్లాలో ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, రూ.10 లక్షలు ఎక్స్​గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

మదనపల్లెలో యోగశాల, భారత్ యోగా కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.