ETV Bharat / state

ఆదివారం విషాదం.. నీటికుంటలో మునిగి విద్యార్థి మృతి

ఓ విద్యాసంస్థ వసతి గృహానికి చెందిన నలుగురు విద్యార్థులు ఈత కోసం వెళ్లి నీటికుంటలో లోతు ఎక్కువై మునిగిపోసాగారు. ఇది గమనించిన స్థానిక ఉపాధ్యాయుడు వారిని కాపాడారు. ప్రకాశం జిల్లా మార్టూరులో ఈ ఘటన జరగ్గా.. శామ్యూల్​ అనే ఓ విద్యార్థి మృతి చెందాడు.

author img

By

Published : Mar 28, 2021, 9:06 PM IST

student died in marturu, student died due to swimming
మార్టూరులో ఈతకెళ్లిన విద్యార్థి మృతి, ఈత కోసం వెళ్లి మరణించిన విద్యార్థి

ప్రకాశం జిల్లా మార్టూరులోని ఓ విద్యాసంస్థ వసతి గృహంలో.. నీటికుంటలో ఈతకు వెళ్లిన మేకల శామ్యూల్ అనే విద్యార్థి మరణించాడు. ఆదివారం కావడంతో తొమ్మిదో తరగతికి చెందిన నలుగురు విద్యార్థులు సరదాగా ఈతకొట్టేందుకు కొలనులోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోతున్న విద్యార్థులను.. స్థానికంగా ఉన్న ఉపాధ్యాయుడు కాపాడారు.

శామ్యూల్ (15) అపస్మారకస్థితిలో ఉండటంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ప్రాణాలు విడిచాడు. మృతుడి స్వగ్రామం బల్లికురవ మండలం వైదనగుడిపాడు. తండ్రి అనారోగ్యంతో గతేడాది మృతి చెందగా.. తల్లి అదే పాఠశాలలో ఆయాగా పని చేస్తోంది.

ప్రకాశం జిల్లా మార్టూరులోని ఓ విద్యాసంస్థ వసతి గృహంలో.. నీటికుంటలో ఈతకు వెళ్లిన మేకల శామ్యూల్ అనే విద్యార్థి మరణించాడు. ఆదివారం కావడంతో తొమ్మిదో తరగతికి చెందిన నలుగురు విద్యార్థులు సరదాగా ఈతకొట్టేందుకు కొలనులోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోతున్న విద్యార్థులను.. స్థానికంగా ఉన్న ఉపాధ్యాయుడు కాపాడారు.

శామ్యూల్ (15) అపస్మారకస్థితిలో ఉండటంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ప్రాణాలు విడిచాడు. మృతుడి స్వగ్రామం బల్లికురవ మండలం వైదనగుడిపాడు. తండ్రి అనారోగ్యంతో గతేడాది మృతి చెందగా.. తల్లి అదే పాఠశాలలో ఆయాగా పని చేస్తోంది.

ఇదీ చదవండి:

ప్రసన్నాంజనేయ స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.