ETV Bharat / state

డ్రైవర్ నిద్ర మత్తు.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

author img

By

Published : Nov 22, 2020, 8:50 AM IST

టెంపో వాహనం మరో వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు బైపాస్ వద్ద జరిగింది. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

road accident
డ్రైవర్ నిద్ర మత్తు.. రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి

ప్రకాశం జిల్లా ఒంగోలు బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. టెంపో వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో నలుగురు వాహనంలో చిక్కుకుని.. తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో టెంపో నుజ్జనుజ్జయింది. వీరందరూ నెల్లూరు నుంచి గుంటూరు వెళుతున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంవల్లే ప్రమాదం జరిగినట్లు చెప్పారు.

ప్రకాశం జిల్లా ఒంగోలు బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. టెంపో వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో నలుగురు వాహనంలో చిక్కుకుని.. తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో టెంపో నుజ్జనుజ్జయింది. వీరందరూ నెల్లూరు నుంచి గుంటూరు వెళుతున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంవల్లే ప్రమాదం జరిగినట్లు చెప్పారు.

ఇవీ చదవండి:

జాతీయ రహదారిపై ప్రమాదం.. డ్రైవర్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.