ప్రకాశం జిల్లా పామూరు మండలం తిరగలదిన్నె గ్రామం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. విజయవాడ నుంచి ప్రొద్దుటూరు వెళ్తుంతుండగా తిరగలదిన్నె సమీపంలో బస్సు స్టీరింగ్ ఒకవైపు లాగుతుందని బ్రేక్ వేయడంతో.. బస్సు బోల్తా పడిపోంది. ప్రమాద సమయంలో బస్సులో సిబ్బందితోపాటు, పది మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి : 'ఏడాదిన్నర పాలనలో ఉత్తరాంధ్ర, రాయలసీమకు చేసిందేంటి?'