ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లో రైతులు మినుము, బొబ్బర్లను సాగుచేశారు. నివర్ తుపాను కారణంగా కురిసిన వర్షాలకు దాదాపు చాలా పంట నష్టపోయారు. ఉన్న పంటను చూసుకునైనా నిబ్బరంగా ఉన్న రైతులను.. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు కలవరపెడుతున్నాయి. పూర్తిగా పంట రాకముందే కోత కోసి నూర్పిళ్లు చేస్తున్నారు. నియోజకవర్గంలో సుమారు 40 వేల హెక్టార్లలో పంటవేయగా.. 18వేల హెక్టార్లలో పంట నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు.
ఇవీ చదవండి..