మాస్క్ లేనిదే ప్రవేశం లేదు.. మాస్కు ఉంటేనే పట్టణంలోకి రండి.. అంటూ ప్రకాశం జిల్లా ఇంకొల్లు పోలీసులు వినూత్నంగా పిలువునిస్తూ.. చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా.. సీఐ అల్తాఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి చెక్పోస్టులు పెట్టారు. ఇంకొల్లు గ్రామం లోనికి ప్రవేశించే అన్ని రోడ్ల వెంట.. చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశారు. మాస్క్ లేకుండా వస్తున్న వారిని ఇంకొల్లు లోపలకి వెళ్లనియకుండా వెనక్కి పంపిస్తున్నారు. మాస్క్ ఉంటేనే ఇంకొల్లులోనికి ప్రవేశం ఉంటుంది.. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి కరోన బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సీఐ అట్లఫ్ హుస్సేన్ కోరారు.
ఇవీ చూడండి...: వ్యాక్సిన్ కేంద్రాలు, కొవిడ్ ఆస్పత్రులపై శ్వేతపత్రం విడుదల చేయాలి''