ETV Bharat / state

వైభవంగా శ్రీ పోలేరమ్మ శిడిమాను ఉత్సవాలు - andhrapradesh

భక్తుల పాలిట కొంగు బంగారమైన శ్రీ పోలేరమ్మ శిడిమాను ఉత్సవాలు ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం, బోయినవారిపాలెంలో కన్నుల పండువగా జరిగాయి. తోటవారిపాలెంలోని ఈ ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా ఆలకరించారు. భక్తులు తయారు చేయించిన బంగారు కాసులపేరును అమ్మవారికి సమర్పించారు.

POLERAMMA_TIRUNALLU
శ్రీ పోలేరమ్మ శిడిమాను ఉత్సవాలు
author img

By

Published : Jul 14, 2021, 10:28 AM IST

ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం సమీపంలోని బోయినవారిపాలెంలో... శ్రీ పోలేరమ్మ అమ్మవారి శిడిమాను ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. భక్తుల పాలిట కొంగు బంగారంగా పేరున్న పోలేరమ్మకు తోటవారి పాలెం గ్రామస్తులు బంగారు కాసులపేరు సమర్పించారు. పోతురాజుల నృత్యాలతో,అమ్మవారి వేషధారణలు, కనక తప్పెట్లతో ఊరేగింపు చేశారు.

పంటలు బాగా పండాలని మహిళలు పొంగళ్లు నైవేద్యంగా సమర్పించారు. మొక్కులు చెల్లించారు. ఒక గొర్రెను పెట్టెలో ఉంచి అమ్మవారి చుట్టూ మూడుసార్లు శిడిమాను తిప్పి ఆ గొర్రెను వదలేస్తారు. ఇలా చేయటం వల్ల గ్రామానికి మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. తరతరాలుగా ఈ ఆనావాయితి కొనసాగుతోంది.

ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం సమీపంలోని బోయినవారిపాలెంలో... శ్రీ పోలేరమ్మ అమ్మవారి శిడిమాను ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. భక్తుల పాలిట కొంగు బంగారంగా పేరున్న పోలేరమ్మకు తోటవారి పాలెం గ్రామస్తులు బంగారు కాసులపేరు సమర్పించారు. పోతురాజుల నృత్యాలతో,అమ్మవారి వేషధారణలు, కనక తప్పెట్లతో ఊరేగింపు చేశారు.

పంటలు బాగా పండాలని మహిళలు పొంగళ్లు నైవేద్యంగా సమర్పించారు. మొక్కులు చెల్లించారు. ఒక గొర్రెను పెట్టెలో ఉంచి అమ్మవారి చుట్టూ మూడుసార్లు శిడిమాను తిప్పి ఆ గొర్రెను వదలేస్తారు. ఇలా చేయటం వల్ల గ్రామానికి మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. తరతరాలుగా ఈ ఆనావాయితి కొనసాగుతోంది.

ఇదీ చదవండి:

weather : బలహీనపడిన అల్పపీడనం..రెండురోజుల పాటు వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.