ప్రకాశం జిల్లా చీరాల గడియారస్తంభం కూడలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర మూడేళ్లయిన సందర్భంగా శుక్రవారం కార్యక్రమాలు చేపట్టాలని వైకాపా శ్రేణులు నిర్ణయించారు. వైఎస్ విగ్రహానికి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసేందుకు వైకాపా కార్యకర్తలు ప్రయత్నించగా...పోలీసులు వారిని అడ్డుకున్నారు.
నియోజకవర్గంలో పోలీస్ 30 యాక్టు, 144 సెక్షన్ అమలులో ఉన్నాయని సీఐ రాజమోహన్ వారికి వివరించే ప్రయత్నం చేశారు. కాగా క్రాంతి అనే వైకాపా సోషల్ మీడియా కార్యకర్త సీఐతో వాగ్వాదానికి దిగాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కొద్దిసేపటి తర్వాత విడిచిపెట్టారు. అనంతరం గడియారం సెంటర్వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
ఇదీ చదవండి: