ETV Bharat / state

కలబంద సాగు.. తీరింది దిగులు - aloevera crop latest news in prakasham

పంటలు సాగు చేయాలంటే లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి. తృణ ధాన్యాలకైనా కనీసం 30 వేల నుంచి 50 వేల వరకు ఖర్చు తప్పనిసరి. ఇందుకు భిన్నంగా కరవు ప్రాంతంలో వినూత్న సాగుకు శ్రీకారం చుట్టారు ఓ రైతు. పెట్టుబడులు లేకుండా పొలంలోనే ఔషధ పంటను సాగు చేస్తున్నారు. కలబందను పండిస్తూ.. మంచి దిగుబడి సాధిస్తున్నారు. నీరు లేకపోయినా పండుతుందని.. రైతుకు కష్టం లేని పంట అని ధీమాగా... చెప్తున్నారు.

farmer getting huge money by farming aloevera crop in prakasham district
కలబంద సాగుతో.. తీరింది దిగులు
author img

By

Published : Dec 19, 2019, 8:03 AM IST

కలబంద సాగుతో.. తీరింది దిగులు

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గొట్టిపడియ గ్రామానికి చెందిన ఒంటెద్దు పెద్ద పిచ్చి రంగారెడ్డి.. ఓ నిర్వాసిత రైతు. ఆ గ్రామం వెలిగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతం అయిన కారణంగా మార్కాపురం పట్టణంలో నివాసం ఉంటున్నారు. పల్లె నుంచి పట్టణానికి వచ్చినా.. ఆయనకు వ్యవసాయంపై ఆసక్తి తగ్గలేదు. ఉద్యాన పంటలైన బత్తాయి, నిమ్మ సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పూర్తిగా ఎండిపోయాయి. కొన్నిరోజుల అలాగే పంట వేయకుండా ఉన్నారు. అనంతరం.. వర్షాభావ పంట సాగు చేయాలని ఆలోచించారు. పుణెకు చెందిన ఓ ప్రేవేట్ కంపెనీని సంప్రదించారు. వారి సలహాలు, మార్కెట్ విషయాలు నచ్చి.. మార్కాపురం మండలం కోమటికుంటలో తనకున్న నాలుగు ఎకరాల పొలంలో సుమారు 3500 కలబంద మొక్కలను సాగు చేశారు. ప్రభుత్వ రాయితీని సద్వినియోగం చేసుకొని బిందు సేద్యం ద్వారా నీటి తడులు అందిస్తున్నారు.

నీటిని అందించకపోయినా ఆరేళ్ళ పాటు పంట సాగుకు ఢోకా లేదని రైతు రంగారెడ్డి చెబుతున్నారు. ఒక్కో మొక్కకున్న కలబంద రెబ్బ.. ప్రస్తుతం అరకిలో నుంచి ఒక కిలో వరకు తూకం వస్తుంది. పంట సమయం పెరిగితే వీటి తూకం పెరుగుతుంది. పుణెకు చెందిన కంపెనీ టన్ను కలబందను 3500 నుంచి 4 వేల వరకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిందని, తద్వారా మార్కెటింగ్​కు కూడా ఇబ్బంది లేదని రైతు అంటున్నారు. ఎకరాకు సుమారు 40 టన్నుల వరకు దిగుబడి వస్తుందన్నారు.

ప్రతి ఏడాది కలబంద మొక్కల నుంచి రెబ్బలను మాత్రమే కట్​ చేసి వాటిని ట్రేలలో ప్యాక్ చేసి ఎగుమతి చేయాల్సి ఉందన్నారు. జ్యూస్, మందులు, సబ్బులతో పాటు పలు రకాల ఔషధాల్లో కలబందను వినియోగించడం వలన మంచి గిరాకీ ఉంటుందన్నారు. ఈ పంటతో రైతుకు ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు రంగారెడ్డి. ఆయనకు మార్కాపురం ఏడీఏ శేఖర్ బాబు, ఏవో లక్ష్మీనారాయణ నిత్యం ఎప్పటికప్పుడు సాగు వద్దకు వెళ్లి సలహాలు సూచనలు ఇస్తున్నారు.

ఇదీ చదవండి:

పల్లె పచ్చదనం... మనసుకు హాయిదనం

కలబంద సాగుతో.. తీరింది దిగులు

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గొట్టిపడియ గ్రామానికి చెందిన ఒంటెద్దు పెద్ద పిచ్చి రంగారెడ్డి.. ఓ నిర్వాసిత రైతు. ఆ గ్రామం వెలిగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతం అయిన కారణంగా మార్కాపురం పట్టణంలో నివాసం ఉంటున్నారు. పల్లె నుంచి పట్టణానికి వచ్చినా.. ఆయనకు వ్యవసాయంపై ఆసక్తి తగ్గలేదు. ఉద్యాన పంటలైన బత్తాయి, నిమ్మ సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పూర్తిగా ఎండిపోయాయి. కొన్నిరోజుల అలాగే పంట వేయకుండా ఉన్నారు. అనంతరం.. వర్షాభావ పంట సాగు చేయాలని ఆలోచించారు. పుణెకు చెందిన ఓ ప్రేవేట్ కంపెనీని సంప్రదించారు. వారి సలహాలు, మార్కెట్ విషయాలు నచ్చి.. మార్కాపురం మండలం కోమటికుంటలో తనకున్న నాలుగు ఎకరాల పొలంలో సుమారు 3500 కలబంద మొక్కలను సాగు చేశారు. ప్రభుత్వ రాయితీని సద్వినియోగం చేసుకొని బిందు సేద్యం ద్వారా నీటి తడులు అందిస్తున్నారు.

నీటిని అందించకపోయినా ఆరేళ్ళ పాటు పంట సాగుకు ఢోకా లేదని రైతు రంగారెడ్డి చెబుతున్నారు. ఒక్కో మొక్కకున్న కలబంద రెబ్బ.. ప్రస్తుతం అరకిలో నుంచి ఒక కిలో వరకు తూకం వస్తుంది. పంట సమయం పెరిగితే వీటి తూకం పెరుగుతుంది. పుణెకు చెందిన కంపెనీ టన్ను కలబందను 3500 నుంచి 4 వేల వరకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిందని, తద్వారా మార్కెటింగ్​కు కూడా ఇబ్బంది లేదని రైతు అంటున్నారు. ఎకరాకు సుమారు 40 టన్నుల వరకు దిగుబడి వస్తుందన్నారు.

ప్రతి ఏడాది కలబంద మొక్కల నుంచి రెబ్బలను మాత్రమే కట్​ చేసి వాటిని ట్రేలలో ప్యాక్ చేసి ఎగుమతి చేయాల్సి ఉందన్నారు. జ్యూస్, మందులు, సబ్బులతో పాటు పలు రకాల ఔషధాల్లో కలబందను వినియోగించడం వలన మంచి గిరాకీ ఉంటుందన్నారు. ఈ పంటతో రైతుకు ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు రంగారెడ్డి. ఆయనకు మార్కాపురం ఏడీఏ శేఖర్ బాబు, ఏవో లక్ష్మీనారాయణ నిత్యం ఎప్పటికప్పుడు సాగు వద్దకు వెళ్లి సలహాలు సూచనలు ఇస్తున్నారు.

ఇదీ చదవండి:

పల్లె పచ్చదనం... మనసుకు హాయిదనం

Intro:AP_ONG_81_18_JK_KALABANDA_FORMER_PKG_AVB_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: పంటలు సాగు చేయాలంటే లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి. తృణ ధాన్యాలకైనా కనీసం 30 వేల నుండి 50 వేల వరకు ఖర్చు తప్పనిసరి. దీనికి భిన్నంగా కరువు ప్రాంతం లో వినూత్న సాగు శ్రీకారం చుట్టాడు.... ఓ రైతు. పెట్టుబడులు లేకుండా పొలం లో ఔషధ పంట కలబంద సాగుచేస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నాడు.

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గొట్టిపడియ గ్రామానికి చెందిన ఒంటెద్దు పెద్ద పిచ్చి రంగారెడ్డి నిర్వాసిత రైతు. ఆ గ్రామం వెలిగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతం కావడం తో మార్కాపురం పట్టణం లో నివాసం ఉంటున్నారు. అయితే పల్లె నుండి పట్టణానికి వచ్చిన వ్యవసాయం పై ఆసక్తి తగ్గలేదు. ఉద్యాన పంటలైన బత్తాయి, నిమ్మ సాగు చేశాడు. తదనంతరం వర్షాభావ పరిస్థితులు తలెత్తడం లో ఈ పంటలు పూర్తిగా ఎండిపోవడం తో వాటిని తొలగించాడు. కొన్నిరోజుల అలాగే స్తబ్దుగా ఉన్న రంగారెడ్డికి వ్యవసాయం తనకున్న మక్కువ మాత్రం తగ్గలేదు.దీంతో వర్షాభావ పంట సాగు చేయాలని ఆలోచన చేశాడు. పూణే కు చెందిన ఓ ప్రేవేట్ కంపెనీని సంప్రదించాడు. వారి సలహాలు, మార్కెట్ విషయాలు నచ్చడం తో మార్కాపురం మండలం కోమటికుంట లో తనకున్న నాలుగు ఎకరాల పొలంలో సుమారు 3500 కలబంద మొక్కలను సాగు చేశాడు. ప్రభుత్వ రాయితీ ని సద్వినియోగం చేసుకొని బిందు సేద్యం ద్వారా నీటి తడులు అందిస్తున్నాడు.

నీటి తడులు అందించకపోయినా ఆరేళ్ళ పాటు పంట సాగుకు డోకా లేదని రైతు రంగారెడ్డి చెబుతున్నాడు. ఒక్కో మొక్కకున్న కలబంద రెబ్బ ప్రస్తుతం అరకిలో నుంచి ఒక కిలో వరకు తూకం వస్తుంది. ఇంకొంత సమయం ఉంటే వీటి తూకం పెరుగుతుంది. పూణే కు చెందిన కంపెనీ తన్ను 3500 నుండి 4 వేల వరకు కొనుగోలు చేసేందుకు ముందుకోచిందని, తద్వారా మార్కెటింగ్ కు కూడా ఇబ్బంది లేదని రైతు అంటున్నాడు. ఎకరాకు సుమారు 40 టన్నుల వరకు దిగుబడి వస్తుందన్నారు. ప్రతి ఏడాది కలబంద మొక్కల నుండి రెబ్బలను మాత్రమే కటింగ్ చేసి వాటిని ట్రే లలో ప్యాక్ చేసి ఎగుమతి చేయాల్సి ఉందన్నారు. జ్యుస్, మందులు, సబ్బులు తో పాటు పలు రకాల ఔషదాల్లో కలబంద ను వినియోగించడం వలన దీనికి మంచి గిరాకీ ఉంటుంది. మార్కాపురం ఏడీఏ శేఖర్ బాబు, ఏవో లక్ష్మీనారాయణ నిత్యం ఎప్పటికప్పుడు సాగు వద్దకు వెళ్లి సలహాలు సుచనలు చేస్తున్నారు.

బైట్స్: ఒంటెద్దు పెద్ద పిచ్చి రంగారెడ్డి....కలబంద రైతు.

ఎన్. లక్ష్మీనారాయణ.....ఏవో....మార్కాపురం.

శేఖర్ బాబు......ఏడిఏ....మార్కాపురం.


Body:పశ్చిమం లో కలబంద సాగు.


Conclusion:8008019243

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.