ప్రకాశం జిల్లా చీరాలలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ -2019 రీజనల్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. సీనియర్ విభాగంలో నెల్లూరు, గుంటూరు జిల్లాల మధ్య జరిగిన పోటీలో నెల్లూరు బృందం 14 పరుగుల తేడాతో గెలుపొందింది. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో పశ్చిమ గోదావరి జిల్లా జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. జూనియర్స్ విభాగంలో నెల్లూరు, కృష్ణా జిల్లాల జట్ల మధ్య పోటీ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈరోజు జరిగిన పోటీల్లో గెలుపొందిన జట్లు రేపు జరిగే ఫైనల్స్కు అర్హత సాధించాయి.
ఇదీ చదవండి :