ప్రకాశం జిల్లా మార్కాపురంలోని కళాశాల రోడ్డులో గిరిజన కళాశాల బాలుర వసతి గృహం ఉంది. సుమారు 100మంది విద్యార్థులు అక్కడ ఉంటూ... వేరు వేరు కళాశాలల్లో విద్యనభ్యసిస్తునున్నారు. అయితే ఆ వసతి గృహానికి దగ్గర్లో మద్యం దుకాణాలు ఉండడంతో... హాస్టల్ ఉంటున్న ప్రాంతాన్ని మందుబాబులు అడ్డాగా మార్చుకున్నారు. విద్యార్థులు బయటకు వెళ్ళేటప్పుడల్లా తాగుబోతులు రెచ్చిపోతూ...వారిపై దాడులకు దిగుతున్నారు. రోజులాగే విద్యార్థులు బయటకి వెళ్లి వస్తున్న సమయంలో.. గణేష్ అనే వ్యక్తి పూటుగా మద్యం సేవించి బండరాళ్లతో విద్యార్థులపై దాడికి దిగాడు. కోడావత్ రంగనాయక్, కోటి నాయక్ అనే ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇలాంటి ఘటనలు తరచు జరుగుతుండటంతో తమ చదువులకు ఆటంకం కలుగుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారులు స్పందించి తమ వసతి గృహానికి రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.
ఇదీచూడండి.లంచం అడిగాడు.. అనిశాకు చిక్కాడు