ETV Bharat / state

రోడ్డెక్కిన 2 వేల మంది వలస కార్మికులు

author img

By

Published : May 6, 2020, 7:41 PM IST

ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఉద్రిక్తత నెలకొంది. తమను స్వస్థలాలకు పంపించాలంటూ వివిధ రాష్ట్రాలకు చెందిన 2 వేల మంది గ్రానైట్ కార్మికులు ఆందోళన బాటపట్టారు. అనుమతులు ఇస్తే తామే సొంతంగా వెళ్లిపోతామని అంటున్నారు. చివరకు అధికారుల హామీతో వారు ఆందోళన విరమించారు.

chimakurthy
chimakurthy
రోడ్డెక్కిన 2 వేల మంది వలస కార్మికులు

ప్రకాశం జిల్లా చీమకుర్తిలో గ్రానైట్‌ క్వారీలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన 2వేల మంది వలస కార్మికులు తమను సొంత గ్రామాలకు పంపించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. బైపాస్‌ రోడ్డుపై ముళ్ల కంచెలు వేసి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. తమను సొంత రాష్ట్రాలకు పంపాలని వారు డిమాండ్ చేశారు.

వీరిలో బీహార్‌, ఒడిశా, ఛత్తీస్‌గడ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. స్పందించిన అధికారులు... వైద్యపరీక్షలు చేసి ఇరురాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చిస్తామని కార్మికులకు చెప్పారు. ప్రభుత్వ ఖర్చులతో సొంత రాష్ట్రాలకు పంపిస్తామని స్పష్టం చేశారు. అధికారుల హామీతో గ్రానైట్‌ కార్మికులు ఆందోళన విరమించారు.

లాక్​డౌన్​తో క్వారీలు, పరిశ్రమలు మూతపడిన కారణంగా.. వీరంతా 40 రోజులుగా పనుల్లేక ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఇటీవల పరిశ్రమల నిర్వహణకు కొంత వెసులు బాటు ఇవ్వటంతో వీరందరినీ మళ్లీ పనుల్లోకి తీసుకునేందుకు క్వారీ, పరిశ్రమల యజమానులు సిద్ధంగా ఉన్నారు. అయినా కూడా.. తాము సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతామని కార్మికులు అంటున్నారు.

రోడ్డెక్కిన 2 వేల మంది వలస కార్మికులు

ప్రకాశం జిల్లా చీమకుర్తిలో గ్రానైట్‌ క్వారీలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన 2వేల మంది వలస కార్మికులు తమను సొంత గ్రామాలకు పంపించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. బైపాస్‌ రోడ్డుపై ముళ్ల కంచెలు వేసి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. తమను సొంత రాష్ట్రాలకు పంపాలని వారు డిమాండ్ చేశారు.

వీరిలో బీహార్‌, ఒడిశా, ఛత్తీస్‌గడ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. స్పందించిన అధికారులు... వైద్యపరీక్షలు చేసి ఇరురాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చిస్తామని కార్మికులకు చెప్పారు. ప్రభుత్వ ఖర్చులతో సొంత రాష్ట్రాలకు పంపిస్తామని స్పష్టం చేశారు. అధికారుల హామీతో గ్రానైట్‌ కార్మికులు ఆందోళన విరమించారు.

లాక్​డౌన్​తో క్వారీలు, పరిశ్రమలు మూతపడిన కారణంగా.. వీరంతా 40 రోజులుగా పనుల్లేక ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఇటీవల పరిశ్రమల నిర్వహణకు కొంత వెసులు బాటు ఇవ్వటంతో వీరందరినీ మళ్లీ పనుల్లోకి తీసుకునేందుకు క్వారీ, పరిశ్రమల యజమానులు సిద్ధంగా ఉన్నారు. అయినా కూడా.. తాము సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతామని కార్మికులు అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.