ETV Bharat / state

విద్యుదాఘాతంతో బాలుడు మృతి.. శోకసంద్రంలో తల్లిదండ్రులు

author img

By

Published : Jan 24, 2021, 5:25 PM IST

ప్రకాశం జిల్లా కొల్లావారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. నీళ్లకోసం మోటర్​ స్విచ్ వేసే క్రమంలో విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందాడు.

boy died with electric shock
విద్యుదాఘాతంతో బాలుడు మృతి.. శోకసంద్రంలో తల్లిదండ్రులు

నీళ్ల కోసం మోటర్ స్విచ్ వేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లా పర్చూరు మండలంలో జరిగింది.

కొల్లావారిపాలెేనికి చెందిన బిళ్లా సుబ్బారావు దంపతులు పొలం దగ్గరికి వెళ్లారు. ఇంట్లో ఉన్న బాలుడు సన్నిబాబు(12) నీళ్ల కోసం మోటార్ స్విచ్ వేసే క్రమంలో విద్యుఘాతానికి గురై కింద పడ్డాడు. చుట్టుపక్కలవారు బాలుడిని ఆటోలో పర్చూరు ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. అప్పటివరకూ కళ్లముందే తిరిగిన కుమారుడు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

నీళ్ల కోసం మోటర్ స్విచ్ వేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లా పర్చూరు మండలంలో జరిగింది.

కొల్లావారిపాలెేనికి చెందిన బిళ్లా సుబ్బారావు దంపతులు పొలం దగ్గరికి వెళ్లారు. ఇంట్లో ఉన్న బాలుడు సన్నిబాబు(12) నీళ్ల కోసం మోటార్ స్విచ్ వేసే క్రమంలో విద్యుఘాతానికి గురై కింద పడ్డాడు. చుట్టుపక్కలవారు బాలుడిని ఆటోలో పర్చూరు ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. అప్పటివరకూ కళ్లముందే తిరిగిన కుమారుడు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇదీ చదవండి: 2 జిల్లాల్లో ప్రమాదాలు... ఒకరు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.