నీళ్ల కోసం మోటర్ స్విచ్ వేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లా పర్చూరు మండలంలో జరిగింది.
కొల్లావారిపాలెేనికి చెందిన బిళ్లా సుబ్బారావు దంపతులు పొలం దగ్గరికి వెళ్లారు. ఇంట్లో ఉన్న బాలుడు సన్నిబాబు(12) నీళ్ల కోసం మోటార్ స్విచ్ వేసే క్రమంలో విద్యుఘాతానికి గురై కింద పడ్డాడు. చుట్టుపక్కలవారు బాలుడిని ఆటోలో పర్చూరు ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. అప్పటివరకూ కళ్లముందే తిరిగిన కుమారుడు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇదీ చదవండి: 2 జిల్లాల్లో ప్రమాదాలు... ఒకరు మృతి