ETV Bharat / state

వైద్యులకు పీపీఈ కిట్లు పంచిన భాజపా నేతలు

ప్రకాశం జిల్లా చినగంజాం భాజపా నేతలు వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. కేంద్రం తీసుకున్న ముందు జాగ్రత్తల వల్లే.. దేశంలో కరోనా అదుపులో ఉందన్నారు.

author img

By

Published : May 7, 2020, 10:35 AM IST

bjp leaders ppe kits distribution
వైద్యులకు భాజాపా నేతల పీపీఈ కిట్ల పంపిణీ

కరోనా మహమ్మరి కట్టడికోసం వైద్యులు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రకాశం జిల్లా చినగంజాం భాజపా నాయకురాలు మంగతాయారు అన్నారు. దేశంలో కేసులు పెరగకుండా ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు, పకడ్బందీ లాక్ డౌన్ వల్లే కోవిడ్ -19 అదుపులో ఉందని భాజపా మహిళామోర్చా అధ్యక్షురాలు తోట విజయలక్ష్మి చెప్పారు.

వారి ఆధ్వర్యంలో పీపీఈ కిట్లను చినగంజాం మండలంలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి అందజేశారు. వైరస్ ప్రబలకుండా ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారని వైద్యసిబ్బందిని కొనియాడారు. కార్యక్రమంలో చినగంజాం తహసీల్దార్ ప్రసాదరావు, ఎంపీడీఓ విజయలక్ష్మి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

కరోనా మహమ్మరి కట్టడికోసం వైద్యులు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రకాశం జిల్లా చినగంజాం భాజపా నాయకురాలు మంగతాయారు అన్నారు. దేశంలో కేసులు పెరగకుండా ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు, పకడ్బందీ లాక్ డౌన్ వల్లే కోవిడ్ -19 అదుపులో ఉందని భాజపా మహిళామోర్చా అధ్యక్షురాలు తోట విజయలక్ష్మి చెప్పారు.

వారి ఆధ్వర్యంలో పీపీఈ కిట్లను చినగంజాం మండలంలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి అందజేశారు. వైరస్ ప్రబలకుండా ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారని వైద్యసిబ్బందిని కొనియాడారు. కార్యక్రమంలో చినగంజాం తహసీల్దార్ ప్రసాదరావు, ఎంపీడీఓ విజయలక్ష్మి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

రెడ్​జోన్​ను పరిశీలించిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.