ETV Bharat / state

రెండేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం...కేసు నమోదు - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదపమెట్లలో ఘోరం జరిగింది. రెండేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

రెండేళ్ల బాలికపై అత్యాచారయత్నం...కేసు నమోదు
రెండేళ్ల బాలికపై అత్యాచారయత్నం...కేసు నమోదు
author img

By

Published : Jan 2, 2021, 8:23 AM IST

ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్లలో రెండేళ్ల చిన్నారిపై.. అదే గ్రామానికి చెందిన మహేశ్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న మహేశ్... బాలికను ద్విచక్రవాహనంపై గ్రామానికి దూరంగా తీసుకువెళ్లాడు. కుమార్తె కనిపించకపోయేసరికి కంగారుపడిన తండ్రి.. మేదరమెట్ల పోలీసులకు సమాచారం అందించాడు.

మహేశ్ పై అనుమానంతో పోలీసులు వెంటనే దర్యాప్తు చేశారు. అతడి సెల్​ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడు ఉన్న ప్రదేశాన్ని పోలీసులు పసిగట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కిడ్నాప్, అత్యాచారం కేసు నమోదు చేశారు. కక్షపూరితంగానే మహేశ్ ఈ పని చేశాడని ఆవేదన చెందాడు.

ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్లలో రెండేళ్ల చిన్నారిపై.. అదే గ్రామానికి చెందిన మహేశ్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న మహేశ్... బాలికను ద్విచక్రవాహనంపై గ్రామానికి దూరంగా తీసుకువెళ్లాడు. కుమార్తె కనిపించకపోయేసరికి కంగారుపడిన తండ్రి.. మేదరమెట్ల పోలీసులకు సమాచారం అందించాడు.

మహేశ్ పై అనుమానంతో పోలీసులు వెంటనే దర్యాప్తు చేశారు. అతడి సెల్​ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడు ఉన్న ప్రదేశాన్ని పోలీసులు పసిగట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కిడ్నాప్, అత్యాచారం కేసు నమోదు చేశారు. కక్షపూరితంగానే మహేశ్ ఈ పని చేశాడని ఆవేదన చెందాడు.

ఇదీ చదవండి:

అనుమానంతో భార్యను చంపిన భర్త అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.