ETV Bharat / state

తెదేపా నేతపై ప్రత్యర్థుల దాడి.. తీవ్రగాయాలు

ఒంగోలు తెదేపా నగర అధ్యక్షుడు కటారి నాగేశ్వరరావుపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. ఘటనలో నాగేశ్వరరావు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

author img

By

Published : Aug 24, 2019, 7:11 PM IST

తెదేపా నేత
ప్రత్యర్థుల దాడిలో తెదేపా నేతకు గాయాలు

ప్రకాశం జిల్లా ఒంగోలు తెదేపా నగర అధ్యక్షుడు కటారి నాగేశ్వరావుపై కొందరు దాడికి పాల్పడ్డారు. మరాఠీపాలెం వద్ద ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతున్న నాగేశ్వరావుని పది మంది యువకులు అడ్డగించి విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రగాయాలైన బాధితుడిని స్థానికులు గమనించి నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తెదేపా కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకే తనపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారని నాగేశ్వరావు ఆరోపించారు. ఇప్పటికీ తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ...తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయకుండా.. తనపైనే ఎదురు కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ప్రత్యర్థుల దాడిలో తెదేపా నేతకు గాయాలు

ప్రకాశం జిల్లా ఒంగోలు తెదేపా నగర అధ్యక్షుడు కటారి నాగేశ్వరావుపై కొందరు దాడికి పాల్పడ్డారు. మరాఠీపాలెం వద్ద ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతున్న నాగేశ్వరావుని పది మంది యువకులు అడ్డగించి విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రగాయాలైన బాధితుడిని స్థానికులు గమనించి నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తెదేపా కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకే తనపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారని నాగేశ్వరావు ఆరోపించారు. ఇప్పటికీ తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ...తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయకుండా.. తనపైనే ఎదురు కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ఇది కూడా చదవండి.

డిప్యూటేషన్ వైద్య సిబ్బందిని వెనక్కి రప్పిస్తాం:మంత్రి బాలినేని

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231


Body:ap_rjy_31_24_minister_tour_annavaram_p_v_raju_av_AP10025_SD. వసతి గృహాల్లో విద్యార్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రెండేళ్లలో వసతిగృహాల రూపురేఖలు మార్చడానికి ప్రణాళిక చేశానని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈయనకు కుఆలయఅధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో అన్ని వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు సందర్శిస్తామన్నారు. కాస్మొటిక్ చార్జీలు నేరుగా విద్యార్థుల ఖాతాల్లో నే జమ అయ్యేలా, సిబ్బంది నియామకం చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతే కాకుండా ప్రభుత్వ నిధులతో పాటు, పలు కంపెనీలు ఇచ్చే సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. బైట్. పినిపే విశ్వరూప్, మంత్రి


Conclusion:ఓవర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.