ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల నిర్వాసితుల పునరావాస కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జె.వి.మురళి అధికారులను ఆదేశించారు. మార్కాపురం డివిజనల్ పరిధిలోని వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకోసం ఏర్పాటు చేసిన మార్కాపురం మండలంలోని ఇడుపూరు 1,2, వేములకోట, గోగులదిన్నే, పెద్దారవీడు మండలములోని దేవరాజుగట్టు, తోకపల్లి, ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. వెలిగొండ ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాల్లో నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
!['పునరావాస కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు వేగవంతం చేయండి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8233412_1011_8233412_1596117917357.png)
ప్రాజెక్టు పునరావాస కేంద్రాల్లో పనులు వేగవంతం
వెలిగొండ ప్రాజెక్ట్ను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రాజెక్ట్ పునరావాస కేంద్రాల్లో గృహ నిర్మాణం, అంతర్గత సిమెంటు రోడ్లు, అంగన్వాడి, పాఠశాలల నిర్మాణాలను త్వరితగతిన ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఏర్పాటు చేసిన కాలనీల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
ఇవీ చదవండి