ETV Bharat / state

డెంగీతో వివాహిత మృతి

తల్లితండ్రులు లేకపోయినా భార్యే తోడుగా ఉంటుందని అనుకున్నాడు. ఇంతలోనే డెంగీ వారి కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. ఆర్థికంగా వెనుకబడి ఉండటంతో వైద్యానికి డబ్బులు లేక... ఓ వివాహిత ఆసుపత్రిలోనే మరణించిన ఘటన ప్రకాశం జిల్లాలోని రాయవరంలో జరిగింది.

author img

By

Published : Nov 27, 2019, 5:40 PM IST

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/27-November-2019/5193142_822_5193142_1574854870186.png
భార్య మృతదేహం రోదిస్తున్న మృతురాలి భర్త
డెంగీతో వివాహిత మృతి

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామానికి చెందిన బచ్చకారి హేమంత్​కు... 4 నెలల క్రితం చీమకుర్తికి చెందిన భవానితో వివాహం అయింది. గ్రామంలో సొంత ఇల్లు కూడా లేని హేమంత్... రైల్వేస్థలంలో రేకులషెడ్ ఏర్పాటు చేసుకుని భార్య, నానమ్మలతో ఉంటున్నాడు. భవానికి తీవ్ర జ్వరంరావడంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు... డెంగీ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో స్థానికంగా ఉండే మరో వైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతూ భవాని మృతి చెందింది. ఆమె మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

ఇదీచూడండి.జ్వరంతో ఆరేళ్ల బాలుడు మృతి

డెంగీతో వివాహిత మృతి

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామానికి చెందిన బచ్చకారి హేమంత్​కు... 4 నెలల క్రితం చీమకుర్తికి చెందిన భవానితో వివాహం అయింది. గ్రామంలో సొంత ఇల్లు కూడా లేని హేమంత్... రైల్వేస్థలంలో రేకులషెడ్ ఏర్పాటు చేసుకుని భార్య, నానమ్మలతో ఉంటున్నాడు. భవానికి తీవ్ర జ్వరంరావడంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు... డెంగీ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. ఆర్థిక స్థోమత లేకపోవడంతో స్థానికంగా ఉండే మరో వైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతూ భవాని మృతి చెందింది. ఆమె మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

ఇదీచూడండి.జ్వరంతో ఆరేళ్ల బాలుడు మృతి

Intro:AP_ONG_82_27_DENGYU_MRUTI_VISHAADAM_AV_AP10071

కంట్రిబ్యూటర్ వి శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: వారిది నిరుపేద కుటుంభం.....రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. వచ్చిన పని చేసుకుంటూ దంపతులిద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే ఇంతలోనే విష జ్వరం రూపంలో ఆ కుటుంభం లో విషాదం నింపింది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామానికి చెందిన బచ్చకారి హేమంత్ తల్లి మరణించడం తో నానమ్మ వద్ద ఉంటున్నాడు. స్థానికంగా చెప్పుల దుకాణంలో పనిచేస్తూ వచ్చిన కొంత నగదు తో జీవిస్తున్నాడు. అయితే చీమకుర్తి కి చెందిన తన మేన మామ కు గుండె జబ్బు ఉండి ఎక్కువకాలం బతకడని తెలిసి ఆయన కుమారై ను నాలుగు నెలల కిందట వివాహం చేసుకున్నాడు. గ్రామం లో సొంత ఇల్లు కూడా లేని హేమంత్ రైల్వే స్థలంలో రేకుల షెడ్ ఏర్పాటు చేసుకుని భార్య భవాని, నానమ్మ లతో ఉంటున్నాడు. పెళ్లి అయిన తర్వాత మూడు నెలల పాటు ఇంటి వద్దే ఉన్న భవాని కుటుంబ పోషణ కష్ఠంగా ఉండడం తో ఆమె కూడా ఓ బట్టల దుకాణం లో కూలీ గా వెళుతుంది. వెళ్లిన 15 రోజులకే తీవ్ర జ్వరం రావడం తో మార్కాపురం లోని ప్రేవేట్ వైద్యశాలలో చేర్పించారు. రక్త పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగ్యూ లక్షణాలు ఉన్నాయంటూ మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. అంత డబ్బు ఖర్చు చేసే స్థోమత లేకపోవడం తో స్థానికంగా ఉండే మరో వైద్యశాలలో చేర్పించారు. అయితే అప్పటికే ప్లేట్ లెట్స్ సంఖ్య పడిపోవడం తో వైద్యశాలలో చికిత్స పొందుతూ భవాని మృతి చెందింది. తండ్రి ఎక్కడ ఉంటాడో తెలియని హేమంత్......తల్లి లేని బాధ ఓ పక్క అంతలొనే పెళ్ళైన నాలుగు నెలలకే భార్య ఇలా మరణించడం తో హేమంత్ ఒంటరివారవ్వడం ఆ కుటుంభం లో తీవ్ర విషాదం నింపింది.


Body:వివాహిత మృతి.


Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.