ETV Bharat / state

రాజధాని నిర్మాణానికి 100మంది మహిళల విరాళం

author img

By

Published : Feb 3, 2019, 5:55 PM IST

Updated : Feb 3, 2019, 6:32 PM IST

ఒంగోలులో పసుపు-కుంకుమ కార్యక్రమంలో పాల్గొన్న డ్వాక్రా మహిళలు తమ ఔదార్యం చాటుకున్నారు. సుమారు 100 మంది రాజధాని నిర్మాణానికి విరాళాలు ఇచ్చారు.

మహిళల విరాళం

మహిళల విరాళం
ప్రకాశం జిల్లా ఒంగోలులో పసుపు-కుంకుమ, ఎన్టీఆర్ ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర అభివృద్ధిలో తాము సైతం అంటూ డ్వాక్రా మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఔదార్యం చాటుకున్నారు. రాజధాని నిర్మాణానికి తమ వంతు సాయం చేస్తామంటూ విరాళాలు అందించారు. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన సందర్భంలోనే.. పలువురు మహిళలు రాజధాని నిర్మాణానికి సహాయం చేశారు. ఒక్కో గ్రూపు సభ్యులు 3 వేల నుంచి 5వేల వరకు విరాళంగా ఇచ్చారు. ఓ దివ్యాంగుడు తనకు వచ్చిన పింఛను డబ్బులు వితరణ చేశారు. సుమారు 100 మంది మహిళలు తమకు వీలైనంత సహాయాన్ని అందజేశారు. గొప్ప మనసు చాటుకున్న మహిళలు, వృద్ధులు, దివ్యాంగులను జనార్దన్ ఘనంగా సత్కరించారు.
undefined

మహిళల విరాళం
ప్రకాశం జిల్లా ఒంగోలులో పసుపు-కుంకుమ, ఎన్టీఆర్ ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర అభివృద్ధిలో తాము సైతం అంటూ డ్వాక్రా మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఔదార్యం చాటుకున్నారు. రాజధాని నిర్మాణానికి తమ వంతు సాయం చేస్తామంటూ విరాళాలు అందించారు. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన సందర్భంలోనే.. పలువురు మహిళలు రాజధాని నిర్మాణానికి సహాయం చేశారు. ఒక్కో గ్రూపు సభ్యులు 3 వేల నుంచి 5వేల వరకు విరాళంగా ఇచ్చారు. ఓ దివ్యాంగుడు తనకు వచ్చిన పింఛను డబ్బులు వితరణ చేశారు. సుమారు 100 మంది మహిళలు తమకు వీలైనంత సహాయాన్ని అందజేశారు. గొప్ప మనసు చాటుకున్న మహిళలు, వృద్ధులు, దివ్యాంగులను జనార్దన్ ఘనంగా సత్కరించారు.
undefined
Intro:AP_ONG_07_03_DONATIONS_CAPITAL_PKG_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
9100075319
...............................................................................
యాంకర్: తమకు అన్ని విధాల అండగా ఉంటున్న ముఖ్యమంత్రికి తోడుగా ఉంటామని డ్వాక్రా మహిళలు అంటున్నారు. అద్భుత రాజధాని అమరావతి కి తమ వంతు సహాయం అందించి ముఖ్యమంత్రి కష్టంలో పాలుపంచుకుంటామని విరాళాలు అందించడానికి ముందుకు వచ్చారు . ప్రకాశం జిల్లా ఒంగోలు లో పసుపు కుంకుమ , ఎన్టీఆర్ ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రాజధాని నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తాయి .రాష్ట్ర అభివృద్ధిలో మేము సైతం అంటున్న డ్వాక్రా మహిళలు వృద్ధులు వికలాంగులు తమ ఔదార్యం చాటుకున్నారు.....

వాయిస్ ఓవర్ :ప్రకాశం జిల్లా ఒంగోలు రెండో రోజు ప్రకాశం పసుపు కుంకుమ ఎన్టీఆర్ ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శాసనమండలి సభ్యుడు , కరణం బలరాం ఇతర అధికారులు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. పసుపు కుంకుమ చెక్కులు అందుకున్న డ్వాక్రా మహిళలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు . అన్ని విధాలా ఆదుకుంటున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో తమ వంతు సహాయం అందివ్వాలన్న ఆలోచనతో తమ చేతనైన సాయం అందిస్తున్నామని తెలిపారు. ఒక గ్రూప్ తరపు నుంచి 3 వేల నుంచి 5వేల వరకు స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ కి అందజేశారు . ఒంగోలు నగరానికి చెందిన వికలాంగుడు తనకొచ్చిన పెన్షన్ డబ్బులు రాజధాని నిర్మాణానికి అందించి తన మంచితనం చాటుకున్నాడు . ఒంగోలు నగరానికి చెందిన మరో మహిళ తన కుమారుడు చంద్రన్న కి అండగా రాజధాని నిర్మాణానికి పది వేల రూపాయల చెక్కును అందివ్వమన్నడంటూ ఎమ్మల్యేకి పదివేల రూపాయల చెక్కును అందజేశారు. ఈ విధంగా సుమారు 100 మంది వరకు మహిళలు తమకు తోచిన సాయాన్ని రాజధానికి ఇవ్వడం జరిగింది .ఈ సందర్భంగా తమ గొప్ప మనసును చాటుకున్న మహిళలకు వృద్ధులకు వికలాంగులకు రాజధాని నిర్మాణానికి సహాయం అందించి నందుకు ఎమ్మెల్యే దామచర్ల కృతజ్ఞతలు తెలిపారు. మహిళలను ఘనంగా సత్కరించి రాబోవు ఎన్నికల్లో చంద్రన్న ని మరల ముఖ్యమంత్రి చేయాలని మహిళలను కోరారు....బైట్స్
మహిళలు


Body:ఒంగోలు


Conclusion:9100075319
Last Updated : Feb 3, 2019, 6:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.