ETV Bharat / state

దంపతుల బలవన్మరణం.. ప్రశ్నార్థకంగా చిన్నారుల భవితవ్యం - latest suicide news in nellore district

నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. క్షణికావేశం... మనస్తాపంగా మారి.. ఇద్దరి జీవితాలను బలి తీసుకుంది. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది.

మనస్తాపంతో భార్య మృతి...భరించలేక భర్త ఆత్మహత్య
author img

By

Published : Oct 9, 2019, 11:42 AM IST

Updated : Oct 9, 2019, 4:43 PM IST

నెల్లూరు జిల్లా విరువూరు గ్రామంలో కుటుంబ కలహాలతో దంపతులు ఒకరి తరువాత ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.... విరువూరుకు చెందిన రఫీ భార్య బీబీ జాన్... తన తల్లి అనారోగ్యంతో ఉన్న కారణంగా పుట్టింటికి వెళ్లింది. 15 రోజులు గడుస్తున్నా.. భార్య ఇంటికి రాకపోవడంపై భర్త రఫీ ఆగ్రహించాడు... కోప్పడ్డాడు. మనస్తాపానికి గురైన బీబీ జాన్.. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మృతిని జీర్ణించుకోలేని భర్త ఆ వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు‌. చికిత్స పొందుతూ రఫీ మృతి చెందాడు. ఆ జంటకు ఇద్దరు చిన్నారులున్నారు. వారి మృతితో చిన్నారులు అనాథలయ్యారు.

ఇదీ చూడండి

నెల్లూరు జిల్లా విరువూరు గ్రామంలో కుటుంబ కలహాలతో దంపతులు ఒకరి తరువాత ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.... విరువూరుకు చెందిన రఫీ భార్య బీబీ జాన్... తన తల్లి అనారోగ్యంతో ఉన్న కారణంగా పుట్టింటికి వెళ్లింది. 15 రోజులు గడుస్తున్నా.. భార్య ఇంటికి రాకపోవడంపై భర్త రఫీ ఆగ్రహించాడు... కోప్పడ్డాడు. మనస్తాపానికి గురైన బీబీ జాన్.. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మృతిని జీర్ణించుకోలేని భర్త ఆ వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు‌. చికిత్స పొందుతూ రఫీ మృతి చెందాడు. ఆ జంటకు ఇద్దరు చిన్నారులున్నారు. వారి మృతితో చిన్నారులు అనాథలయ్యారు.

ఇదీ చూడండి

రెచ్చిపోయిన గొలుసు దొంగలు... పోలీసు స్టేషన్ ఎదుటే దొంగతనం

Intro:దంపతులు ఆత్మహత్యBody:*కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్య*

*_హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి_*

*_అనాధలైన ఇద్దరు చిన్నారులు_*

నెల్లూరు జిల్లా *పొదలకూరు* : మండలంలోని విరువూరు గ్రామంలో కుటుంబ కలహాలు , అప్పులబాధ తాళలేక దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నెల్లూరులో ఓ ప్రయివేటు వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. విరువూరు గ్రామానికి చెందిన బిబిజాన్ అనే యువతికి చేజర్ల మండలం ఆదూరుపల్లి గ్రామానికి చెందిన రఫీ అనే యువకుడికిచ్చి వివాహం చేశారు. అయితే రఫీ చేసిన కొన్ని వ్యాపారాల్లో నష్టం రావడంతో అప్పుల పాలైపోయాడు. ఇదే సందర్భంలో జిజిజాన్ తల్లి అనారోగ్యం కావడంతో విరువూరు కొచ్చింది. 15 రోజులు గడుస్తున్న భార్య ఇంటికి రాకపోవడంతో ఆగ్రహించిన భర్త రఫీ భార్య మీద కోపడడంతో మనస్తాపానికి గురైన బీబీజాన్ ఆదివారం పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది నెల్లూరు వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.భార్య మృతి జీర్ణించుకోలేని భర్త కూడ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు‌.అతని పరిస్ధితి విషమించడంతో నెల్లూరు వైద్యశాలకు తరలించారు.చికిత్స పొందుతూ రఫీ మంగళవారం మృతి చెందాడు.మృతులకు ఇద్దరు చిన్నారులున్నారు. వారి మృతితో చిన్నారులు అనాధలయ్యారు. పొదలకూరు ఎస్ఐ రహీంరెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు
Last Updated : Oct 9, 2019, 4:43 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.