ప్లాస్టిక్ సీసాల వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా.. గాంధీబొమ్మ, ఆర్టీసీ బస్టాండ్, ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతాల్లో సీఎస్ఆర్ నిధులతో క్రషింగ్ యంత్రాలు ఏర్పాటు చేశామని మంత్రి అనిల్ తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలను యంత్రంలో వేస్తే రీసైక్లింగ్ అవుతుందని, దాంతో పాటు ఓ గిఫ్ట్ కూపన్ వస్తుందన్నారు. ఇందుకోసం ఖాదీబండార్, ఓ రెస్టారెంట్తో ఒప్పందం కుదుర్చుకున్నామని, వీటి సంఖ్య మరింత పెంచేలా షాపింగ్ మాల్స్, రెస్టారెంట్ తదితరాల్లో డిస్కౌంట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మరో ఎనిమిది నెలల్లో కార్పొరేషన్కు సంబంధించిన రూపురేఖలు మార్చేలా ముందుకెళుతున్నామన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్కుమార్, నాయకులు ఎండీ ఖలీల్ అహ్మద్, దార్ల వెంకటేశ్వర్లు, మహేష్, నీలి రాఘవరావు, సుధీర్, మున్వర్, సిద్దిక్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మీడియాకు దూరంగా ఉండాలన్న సింగిల్ జడ్జి తీర్పుపై మంత్రి పెద్దిరెడ్డి అప్పీల్