వాయిదాలు చెల్లించలేదని ఓ ప్రముఖ ఫైనాన్స్ సంస్థ దివ్యాంగుడిపై కర్కశత్వాన్ని ప్రదర్శించింది. కనికరం లేకుండా నాయుడుపేట రైల్వే స్టేషన్ ఆవరణలో వదిలి అతని వాహనాన్ని తీసుకెళ్లారు. దిక్కుతోచని స్థితిలో బుధవారం మధ్యాహ్నం నుంచి ఆ దివ్యాంగుడు స్టేషన్ ఆవరణలో కాలం వెల్లదీస్తున్నాడు.
నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని భరత్ నగర్లో మునికృష్ణ అనే దివ్యాంగుడు నివాసముంటున్నాడు. తనకున్న మూడు చక్రాల వాహనంపై పండ్లు అమ్ముతూ..పేపర్ వేస్తూ జీవిస్తున్నాడు. కరోనా వైరస్ వల్ల ఉపాది కోల్పోయాడు. పనుల్లేక ఇంటి అద్దె చెల్లించేందుకు దివ్యాంగుడు మూడు చక్రాలు మోటారు సైకిల్పై రూ.17వేలు రుణం పొందాడు. దివ్యాంగుడనే కనీస కనికరం లేకుండా.. వాయిదా కట్టలేదని అతన్ని నడిరోడ్డుపై దించేసి వాహనం తీసుకెళ్లారు. నెల రోజులు గడువు కోరనా కనికరించలేదు.
ఇదీ చదవండి: రామ మందిర నిర్మాణానికి విరాళాల వెల్లువ