అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు... కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలను నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవతామూర్తులకు సుప్రభాతం.. తోమాల సేవ.. అభిషేకాలు.... ప్రత్యేక పూజా కార్యక్రమాలను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి పాలు.. పెరుగు.. పసుపు.. కుంకుమ గంధపు జలాలతో అభిషేకాలు చేశారు. పుష్కరిణిలో భక్తుల నడుమ స్వామివారికి చక్రస్నానం కనులవిందుగా జరిగింది. భక్తులు వేలాదిగా పాల్గొని చక్రస్నానం ఆచరించారు.
ఇదీ చూడండి: తిరుమల బ్రహ్మోత్సవ వైభవం చూతము రారండి