ETV Bharat / state

దివ్యాంగురాలిపై దాడి బాధాకరం: మంత్రి అనిల్ కుమార్

నెల్లూరు జిల్లాలోని టూరిజం హోటల్లో మహిళా ఉద్యోగిపై డిప్యూటీ మేనేజర్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాధితురాలిని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరామర్శించారు. దాడి చేసిన భాస్కర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

author img

By

Published : Jul 1, 2020, 1:30 PM IST

minister anil kumar
minister anil kumar

నెల్లూరు టూరిజం హోటల్​లో దాడికి గురైన మహిళా ఉద్యోగి దివ్యాంగురాలైన ఉషారాణిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరామర్శించారు. నగరంలోని కొండాయపాలెం గేటు వద్దనున్న ఉషారాణి నివాసానికి వెళ్లిన మంత్రి.. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగురాలిపై దాడి ఘటన బాధాకరమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ దాడికి పాల్పడిన డిప్యూటీ మేనేజర్ భాస్కర్​పై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితురాలికి ధైర్యం చెప్పి, అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

నెల్లూరు టూరిజం హోటల్​లో దాడికి గురైన మహిళా ఉద్యోగి దివ్యాంగురాలైన ఉషారాణిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరామర్శించారు. నగరంలోని కొండాయపాలెం గేటు వద్దనున్న ఉషారాణి నివాసానికి వెళ్లిన మంత్రి.. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగురాలిపై దాడి ఘటన బాధాకరమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ దాడికి పాల్పడిన డిప్యూటీ మేనేజర్ భాస్కర్​పై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితురాలికి ధైర్యం చెప్పి, అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: తల్లి జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.