నెల్లూరులో ప్రసిద్ధి చెందిన శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఉత్సవాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్తీక మాసంలో ముఖ్యమైన ఐదు రోజులు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున... ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి సూచించారు. సమావేశానికి అగ్నిమాపక అధికారులు హాజరుకాకపోవడంపై అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
తొలి మ్యాచ్లోనే 'ఠాక్రే' సూపర్ హిట్- 'కుర్చీ'యే టార్గెట్!