భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం శ్రీ హరికోట నుంచి ఈనెల 15 ఉదయం 2.51గంటలకు చంద్రయాన్-2 ప్రయోగించనుంది. ఈ ప్రయోగం విజయవంతం చేసేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. జీఎస్ఎల్వీ మార్కు3 ద్వారా జరుగుతున్న నాలుగో ప్రయోగం. భారత జాతీయ పతాకం చిత్రించిన ఈ రాకెట్ను బాహుబలిగా శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. దీని బరువు 640 టన్నులు.... ఎత్తు దాదాపుగా 15 అంతస్థులుంటుంది.
జీఎస్ఎల్వీ రాకెట్ 3.8 టన్నుల బరువు ఉపగ్రహాలను మోసుకెళ్తుంది. అందులో ఏర్పాటు చేసిన ఆరిబిటర్, లాండర్, రోవర్ లు 3877 కిలోలు. ఆరు చక్రాలతో చందమామ పై నడిచే ప్రగాన్ రోవర్ పెట్టారు. ఇది చంద్రుడి దక్షిణ ధువం వద్ద పరిశోధనలు చేస్తుంది. ఈనెల 13న ఎం.ఆర్.ఆర్ లాబ్ సమావేశం జరుగుతుంది. తర్వాత రాకెట్ ప్రయోగ సంసిద్ధత తెలుపుతారు.అనంతరం కౌంట్ డౌన్ కొనసాగించి ప్రయోగం జరుపుతారు. ఈ ప్రయోగం వీక్షించేందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా రానుండటంతో కట్టుదిట్ట మైన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి.. వడ్డీలేని రుణాలిచ్చాం.. ఇవిగో ఆధారాలు: చంద్రబాబు