నెల్లూరు(nellore district) నగరంలోని నవాబుపేట పరిధిలోని ముకుందాపురంలో దారుణ హత్య(brutal murder) జరిగింది. బేకరిలో పని చేస్తున్న సేల్స్ పర్సన్, మాష్టర్ల మధ్య వివాదం హత్యకు దారితీసింది. కోపంతో సేల్స్ పర్సన్.. చిన్నా అనే వ్యక్తిపై చాకుతో దాడి చేశాడు. ఘటనాస్థలంలోనే చిన్నా అక్కడిక్కడే మృతి చెందాడు. హత్య చేసిన నిందితుడు పరారయ్యాడు.
సమాచారంం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు.
ఇదీ చదవండి