ETV Bharat / state

మహిళను ఢీ కొట్టిన వాహనం... ఆసుపత్రికి తరలిస్తుండగా మరణం - నెల్లూరు జిల్లా తాజా ప్రమాదం వార్తలు

ఉదయగిరి పట్టణంలో ఓ మహిళ ద్విచక్రవాహనం ఢీకొని మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు యువకుడిని పోలీసులకు అప్పగించారు. గాయపడిన ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటం వలన ప్రైవేటు అంబులెన్స్​లో ఆత్మకూరు తరలిస్తుండగా దారిలో చనిపోయారు. మహిళ మంగళ కట్ట వీధిక చెందిన షేక్​ మహబూబ్​ జానీగా పోలీసులు గుర్తించారు.

bike-hit-a-lady-and-died-in-nellore-district
బైక్​ ఢీకొని మహిళ మృతి
author img

By

Published : Jun 22, 2020, 6:19 AM IST

ద్విచక్రవాహనం ఢీకొట్టి మహిళ మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగింది. పట్టణంలోని మంగళ కట్ట వీధికి చెందిన షేక్​ మహబూబ్​ జానీ (50) రోడ్డుపై నడుచుకుంటూ పంచాయతీ బస్ స్టాండ్​ వైపు వెళ్తుండగా... అదే సమయంలో ద్విచక్రవాహనంపై మధు అనే యువకుడు ఆమెను వేగంగా ఢీకొట్టాడు.

కింద పడిన మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. యువకుడికి దేహశుద్ధి చేసిన స్థానికులు... పోలీసులకు అప్పగించారు. గాయపడిన మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఆత్మకూరు వైద్యశాలకు తీసుకువెళ్తుండగా... మార్గ మధ్యలో మరణించారు. ఘటనపై ఎస్సై మరిడి నాయుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ద్విచక్రవాహనం ఢీకొట్టి మహిళ మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగింది. పట్టణంలోని మంగళ కట్ట వీధికి చెందిన షేక్​ మహబూబ్​ జానీ (50) రోడ్డుపై నడుచుకుంటూ పంచాయతీ బస్ స్టాండ్​ వైపు వెళ్తుండగా... అదే సమయంలో ద్విచక్రవాహనంపై మధు అనే యువకుడు ఆమెను వేగంగా ఢీకొట్టాడు.

కింద పడిన మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. యువకుడికి దేహశుద్ధి చేసిన స్థానికులు... పోలీసులకు అప్పగించారు. గాయపడిన మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఆత్మకూరు వైద్యశాలకు తీసుకువెళ్తుండగా... మార్గ మధ్యలో మరణించారు. ఘటనపై ఎస్సై మరిడి నాయుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...12 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.