ETV Bharat / state

సింహపురి ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ ఘటనపై స్పందించిన కలెక్టర్

author img

By

Published : May 4, 2019, 5:59 AM IST

గత నెల 17వ తేదీన సింహపురి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు.

సింహపురి ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ ఘటనపై స్పందించిన కలెక్టర్

నిబంధనలకు విరుద్ధంగా అవయవదానం నిర్వహించిన నెల్లూరు సింహపురి ఆసుపత్రిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ప్రకటించారు. అవయవదానం జరిగిన తీరుపై విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశామని, వారి ఆదేశాల ప్రకారం ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఆసుపత్రి పై క్రిమినల్ కేసు పెట్టామని, ఆసుపత్రి రిజిస్ట్రేషన్ రద్దు తో పాటు, నిబంధనలకు విరుద్ధంగా అవయవదానాన్ని ప్రోత్సహించిన అయిదు మంది వైద్యుల రిజిస్ట్రేషన్ రద్దు చేసేందుకు వైద్య శాఖకు సిఫార్సు చేస్తామన్నారు. అల్లూరు మండలం ఉద్దీపగుంటకు చెందిన ఏకుల శీనయ్య గత నెల 17వ తేదీన రోడ్డు ప్రమాదంలో గాయపడి సింహపురి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. వైద్యానికి అయిన బిల్లులు చెల్లించని పక్షంలో అవయవదానానికి అంగీకరించాలని వైద్యులు ఒత్తిడి తేవడం, దీనిపై విమర్శలు రావడంతో అధికారుల విచారణ చేపట్టి చర్యలకు ఉపక్రమిస్తున్నారు.

సింహపురి ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ ఘటనపై స్పందించిన కలెక్టర్

నిబంధనలకు విరుద్ధంగా అవయవదానం నిర్వహించిన నెల్లూరు సింహపురి ఆసుపత్రిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ప్రకటించారు. అవయవదానం జరిగిన తీరుపై విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశామని, వారి ఆదేశాల ప్రకారం ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఆసుపత్రి పై క్రిమినల్ కేసు పెట్టామని, ఆసుపత్రి రిజిస్ట్రేషన్ రద్దు తో పాటు, నిబంధనలకు విరుద్ధంగా అవయవదానాన్ని ప్రోత్సహించిన అయిదు మంది వైద్యుల రిజిస్ట్రేషన్ రద్దు చేసేందుకు వైద్య శాఖకు సిఫార్సు చేస్తామన్నారు. అల్లూరు మండలం ఉద్దీపగుంటకు చెందిన ఏకుల శీనయ్య గత నెల 17వ తేదీన రోడ్డు ప్రమాదంలో గాయపడి సింహపురి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. వైద్యానికి అయిన బిల్లులు చెల్లించని పక్షంలో అవయవదానానికి అంగీకరించాలని వైద్యులు ఒత్తిడి తేవడం, దీనిపై విమర్శలు రావడంతో అధికారుల విచారణ చేపట్టి చర్యలకు ఉపక్రమిస్తున్నారు.

సింహపురి ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ ఘటనపై స్పందించిన కలెక్టర్

ఇవీ చదవండి

రీపోలింగ్​కు సర్వ సిద్ధం: నెల్లూరు ఎస్పీ

New Delhi, May 03 (ANI): On the sexual harassment allegations against Chief Justice of India (CJI), former Attorney General (AG) Mukul Rohatgi said " I'm very saddened by these kind of allegations, it is not only an allegation on the CJI, it's like an attack on judiciary. From whatever I know CJI is a man of integrity and morality. AG Mukul Rohatgi further added he is seeing reports by some NGOs and others that this inquiry should stop now, some outsider should join, it's completely wrong, there can be no outsider. It's an in-house committee, in-house means from within Supreme Court.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.